Newsఆ స్టార్ హీరోయిన్ చెల్లికి టాలీవుడ్‌లో ఏం జ‌రిగింది... ఒక్క సినిమాకే...

ఆ స్టార్ హీరోయిన్ చెల్లికి టాలీవుడ్‌లో ఏం జ‌రిగింది… ఒక్క సినిమాకే దండం పెట్టేసిందిగా…!

ఇటీవల కాలంలో చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో కొందరు హీరోయిన్లుగా టాలీవుడ్ లో సక్సెస్ అవుతుంటే.. మరికొందరు వరుసఫ్లాపులతో మళ్ళీ బాలీవుడ్ బాట పడుతున్నారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ఉన్న వాళ్ళు కూడా తెలుగులో ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. కొందరు రకరకాల కారణాలతో టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు అంగీకరించడం లేదు.

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు గా ఉన్న కృతి సనన్‌, కియారా అద్వానీ లాంటి హీరోయిన్లు టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలలో నటించినా ఇక్కడ ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలోనే కృతి సనన్‌ సోదరి నుపూర్ స‌న‌న్ కూడా మాస్ మహారాజ్ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఎలాగైనా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి ఇక్కడ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో నుపూర్ ఆశలు అన్ని గల్లంతు అయ్యాయి. అక్క కృతి సనన్ కూడా తెలుగులో మహేష్ బాబుకి జోడిగా నటించిన తొలి సినిమా వన్ నేనొక్కడినితో పెద్ద డిజాస్టర్ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య దోచేయ్ సినిమాలో నటించిన అది కూడా ప్లాప్ అయింది. చివరకు ప్రభాస్ ఆదిపురుష్‌ చేసిన ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. ఇప్పుడు అక్క సెంటిమెంట్ ఫాలో అవుతూ నుపుర్ కూడా తొలి సినిమానే పెద్ద డిజాస్టర్ అయింది.

ఇక నుపూర్ .. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్పలో హీరోయిన్గా ఎంపికైంది. ఏమైందో తెలియదు కానీ చివరి నిమిషంలో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారు. టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. రెండో సినిమాకు కూడా ఆమెకు పెట్టిన కండిషన్లు చూసి తట్టుకోలేక ఆమె తెలుగులో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుని బాలీవుడ్‌కి ఫిక్స్ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news