Moviesప్రేమ‌లో ప‌డిపోయాను... రేణుదేశాయ్ ఇంత‌ ఎమోష‌న‌ల్ కామెంట్స్ ఎందుకు....!

ప్రేమ‌లో ప‌డిపోయాను… రేణుదేశాయ్ ఇంత‌ ఎమోష‌న‌ల్ కామెంట్స్ ఎందుకు….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. చాలాకాలం తర్వాత ఆమె తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్రతో ఎంట్రీ ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాను చూశారు. డిసెంబర్ ఒకటిన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తోంది.

కేవలం ఐదు రోజుల్లో రు. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ర‌ణ‌బీర్ క‌పూర్ – రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకంగా నాలుగు పేజీల రివ్యూ రిలీజ్ చేశారు. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమా చూసిన రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎట్టకేలుకు సందీప్ రెడ్డి యానిమల్ సినిమా చూడాల్సి వచ్చింది.. సినిమా చూసి తాను ఎలాంటి డౌట్ లేకుండా ప్రేమలో పడిపోయాన‌ని కామెంట్ చేశారు.

ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి… మీరు ఏదైనా స్పెషల్ అనుభూతి పొందాలనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలో చూడటం మిస్ కావద్దని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఈ సినిమాకు మరింత బూస్ట్ అప్ అవుతుంది అనటంలో సందేహం లేదు. ఏది ఏమైనా యానిమల్ సినిమాకు పలువురు సినీ సెలబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news