Movies42 ఏళ్ల వ‌య‌స్సులోనూ సెగ‌లు రేపుతోన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు...

42 ఏళ్ల వ‌య‌స్సులోనూ సెగ‌లు రేపుతోన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా…!

హీరోయిన్లకు వయసు పెరిగితే.. గ్లామర్ తగ్గిపోతుందని చాలామంది అంటూ ఉంటారు. అదేంటో గాని కొందరు 40 – 45 – 50 సంవత్సరాలు వచ్చిన చాలా యంగ్‌గా కనిపిస్తూ ఉంటారు. పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ 42 క్రాస్ చేసినప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంతో కనిపిస్తోంది. ఆమె మన టాలీవుడ్ లో కూడా సినిమాలలో నటించింది. ఆ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా..? ఆమె మొత్తం ఏడు భాషల్లో సినిమాలు చేసింది.

ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది. పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు రియాసేన్.
ఆమె స్వతహాగా బెంగాలీ. రియాసేన్.. అమ్మ, అమ్మమ్మ కూడా హీరోయిన్లే. అంతెందుకు.. ఆమె అక్క కూడా హీరోయిన్ నే. తెలుగులో నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ధైర్యం సినిమాలో చేసిన రైమాసేన్ ఈమెకు సొంత అక్క. వీళ్లందరి వారసత్వాన్ని కొనసాగిస్తూ రియాసేన్ ఐదేళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. 10 ఏళ్ల వయసు నుంచి పూర్తిస్థాయి నటిగా మారిపోయింది.

18 ఏళ్ల టీనేజ్ వయసులో తాజ్ మహల్ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత బెంగాలీ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్, ఒడియా భాషల్లో కొన్ని సినిమాలలో నటించింది. 2008లో రిలీజ్ అయిన నేను మీకు తెలుసా అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ప్లాప్ అవడంతో ఆమెకు తెలుగులో ఛాన్సులు రాలేదు.

ఇక రెండు, మూడేళ్ల నుంచి ఆమెకు సినిమాలలోను.. ఇటు వెబ్ సిరీస్‌లోనూ ఛాన్సులు రావడం లేదు. దీంతో ఇన్‌స్టాలో తన గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు వీనుల‌ విందు ఇస్తుంది. ప్రస్తుతం ఈమె వయసు 42 సంవత్సరాలు. అయిన ఆమె అస్సలు అలా కనిపించడం లేదు. అక్క రైమాసేన్ లాగానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే సింగిల్‌గా ఉండిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news