Newsవేణు మాధవ్, ఉదయభాను మధ్య అంత రిలేష‌న్ ఉండేదా...!

వేణు మాధవ్, ఉదయభాను మధ్య అంత రిలేష‌న్ ఉండేదా…!

దివంగత సినీ నటుడు వేణు మాధవ్, యాంకర్ కం నటి ఉదయభానుల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు. దీనికి కారణం లేకపోలేదు. వీరిద్దరు కలిసి పలుచోట్ల ఎంటర్‌టైనెంట్ ప్రోగ్రాంస్ చేశారు. ఇద్దరు కలిసి స్మాల్ స్క్రీన్ మీద కూడా చాలా కార్యక్రమాలు చేశారు. మిగతా యాంకర్స్ కంటే వేణుమాధవ్ ఊదయభానుతోనే ఎక్కువ చనువుగా ఉంటారట.

ఉదయభాను కెరీర్ 5 వేల రూపాయలతో మొదలైందనే టాక్ ఉంది. అలా మొదలైన ఆమె కెరీర్ ఒక దశలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది. బుల్లితెరపై ఎక్కువ షోలకి యాంకర్ గా చేసి అలరించింది. సినిమా ఆడియో ఫంక్షన్స్ కి హోస్ట్‌గా వ్యవహరించింది. ఉదయభాను యాక్టివ్‌నెస్ చూసి సినిమాలలోనూ అవకాశాలు ఇచ్చారు.

ఎక్కువగా ఆమె క్యారెక్టర్స్ కంటే కూడా ఐటెం సాంగ్స్ చేసి అలరించింది. లీడర్ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఉదయభానుకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే, జులాయి సినిమాలో అల్లు అర్జున్ సరసన కూడా చేసిన ఐటెం సాంగ్ బాగా క్రేజ్ తెచ్చింది. అయితే, వేణుమాధవ్ చనిపోయిన తర్వాత ఉదయభానుకి అవకాశాలు తగ్గాయనే మాట వాస్తవం అంటారు.

గమనిస్తే నిజమనే అనిపిస్తుంది. వేణుమాధవ్ బ్రతికి ఉన్నన్ని రోజులు తన పరపతి ఉపయోగించి ఉదయభానుకి అవకాశాలు వచ్చేలా చేరాశరట. ఫ్యామిలీ పరంగా కూడా బాగా క్లోజ్ అట. వేణుమాధవ్ ఉండే ఏరియాలో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఉదయభానుని గెస్ట్‌గా పిలిచి తనకి ఆర్థికంగా చాలా హెల్ప్ చేశాడట. అందుకే, వేణుమాధవ్ చనిపోయిన విషయం తెలిసి తల్లడిల్లిన వాళ్ళలో ఉదయభాను గురించే ఎక్కువగా చెప్పుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news