Newsబెస్ట్ ఫ్రెండ్స్ నాగార్జున - అనుష్క మ‌ధ్య మాట‌లెందుకు లేవ్‌.. వీరికి...

బెస్ట్ ఫ్రెండ్స్ నాగార్జున – అనుష్క మ‌ధ్య మాట‌లెందుకు లేవ్‌.. వీరికి ఎక్క‌డ చెడింది…?

టాలీవుడ్ లో సీనియర్ హీరో నాగార్జున, స్వీటీ బ్యూటీ అనుష్క కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉండేది. అనుష్క.. నాగార్జున సూపర్ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయింది. అంతకుముందే అక్కినేని ఫ్యామిలీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె ముందుగా నాగచైతన్యకు యోగా టీచర్. అన్నపూర్ణ స్టూడియోలో అనుష్క – పూరి జగన్నాథ్ సూపర్ సినిమాతో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున – అనుష్క కాంబినేషన్లో ఢ‌మరుకం, రగడ, ఓం నమో వెంకటేశాయ ఇలా పలు సినిమాలు వ‌చ్చాయి.

వీటితోపాటు నాగార్జున నటించిన కొన్ని సినిమాలలో అనుష్క గెస్ట్ రోల్ కూడా చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌కు వెండితెరపై ఎంతో క్రేజీ ఉండేది. నాగార్జున అండదండలతో అనుష్క టాలీవుడ్‌లో ఇతర హీరోల సినిమాలలో కూడా ఛాన్సులు కొట్టేసింది. 10 ఏళ్ల పాటు అస్సలు ఆమెకు తిరుగులేదు. పైగా అనుష్క – నాగార్జున కలిసి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా పెట్టారన్న ప్రచారం ఉంది. అలాగే ఏపీ రాజధాని అమరావతి లోను వీరు కలిసి రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారని అంటారు.

నాగార్జున ఏం చెప్తే అనుష్క అది చేసేది. నాగార్జున అంటే అనుష్కకు అంత నమ్మకం. అసలు ఒకానొక టైం లో అనుష్క – నాగార్జున లోకంగా బతికేసేదని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి. ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. వీరిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడనంత శత్రుత్వం పెరిగిపోయింది. అయితే స్వతహాగా అనుష్క కంటే నాగార్జన సీనియర్. కొన్ని సందర్భాల్లో తన మాటే నెగ్గాలనుకునే మనస్తత్వం ఆయనది.

నాగార్జున కొన్ని సందర్భాలలో అనుష్కని డామినేట్ చేసేలా ప్రవర్తించడం.. ఆమె మనసును ఎక్కడో హర్ట్ చేసిందని అక్కడి నుంచి ఇద్దరు మధ్య గ్యాప్ పెరిగి.. అది క్రమంగా పెద్దదైందని.. ఇండస్ట్రీలో పుకారు ఉంది. చివరకు అనుష్క వస్తే లోపలకు కూడా రానివద్దని నాగార్జున గేట్మెన్‌లకు గట్టిగా చెప్పడం.. ఆ తర్వాత అనుష్క – నాగార్జున ఇంటికి వెళ్లేందుకు రెండు మూడుసార్లు ప్రయత్నాలు చేసిన కుదరకపోవడంతోనే ఆమె మనసు కూడా విరిగిపోయిందని.. అలా ఇద్దరి మధ్య ఇప్పుడు మాటలు లేవని.. ఇండస్ట్రీలో గట్టి ప్రచారం అయితే ఉంది.

గత నాలుగైదు ఏళ్లుగా వీరిద్దరు ఎదురుపడేందుకు కూడా ఇష్టపడటం లేదట. అదే టైంలో అనుష్క ప్ర‌భాస్‌కు బాగా ద‌గ్గ‌రైంది. వీరి కాంబోలో వ‌రుస‌గా మిర్చి, బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 సినిమాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత యూవీ బ్యాన‌ర్‌కు ఆమె క్లోజ్ అయ్యి.. ఆ బ్యాన‌ర్లో కూడా సినిమాలు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news