Newsనాగార్జున ఆ హీరోయిన్ల‌కు ఎందుకు ఛాన్సులిచ్చేవాడో తెలుసా... ఆ టాప్ సీక్రెట్...

నాగార్జున ఆ హీరోయిన్ల‌కు ఎందుకు ఛాన్సులిచ్చేవాడో తెలుసా… ఆ టాప్ సీక్రెట్ ఇదే..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తండ్రుల వారసత్వం కొనసాగించిన మొదటి తరం హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. వాయిస్ బాగోదని..ఈ పర్సనాలిటీతో హీరోగా సక్సెస్ కాడని, నాగేశ్వర రావు గారి పేరును ఖచ్చితంగా చెడగొడతాడని..ఇలా రక రకాలుగా మాట్లాడుకున్నారు.

అయినా అక్కినేని ఫ్యామిలీలో రొమాంటిక్ హీరోగా ఏఎన్ఆర్ కి ఎంత పాపులారిటీ వచ్చిందో అంత పాపులారిటీ నాగార్జునకి వచ్చింది. నిర్మాతగా కూడా అంతకన్నా ఎక్కువ పాపులారిటీనే వచ్చింది. అయితే, నాగార్జున కెరీర్ ఊపందుకోవడానికి ఒకదశలో ఎక్కువగా బాలీవుడ్‌లో స్టార్స్ గా వెలుగుతున్న వారినికి తన సినిమాలలో హీరోయిన్ గా తీసుకున్నారు. చెప్పాలంటే ఆ హీరోయిన్స్ వల్ల నాగార్జున కెరీర్ బాగానే ఊపందుకుంది.

కెరీర్ ప్రారంభంలో అసలు హీరోగా పనికిరాడని కామెంట్స్ చేసిన వారే మన్మధుడు అని పిలిచారు. బిజినెస్ మేన్ గా హీరోగా నాగార్జున కింగ్ అనిపించుకున్నారు. అప్పట్లో సుస్మితా సేన్, శిల్ప శెట్టి, టబు, మనీషా కోయిరాలా బాలీవుడ్ లో ఒక ఊపు ఊపుతున్నారు. వాళ్ళు అక్కడ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. అలాంటి వారిని నాగార్జున ధైర్యం చేసి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి టాలీవుడ్ కి తీసుకువచ్చారు.

రక్షకుడు సినిమాలో సుస్మిత సేన్, ఆజాద్ సినిమాలో శిల్పా శెట్టి, క్రిమినల్ సినిమాలో మనీషా కోయిరాల, నిన్నే పెళ్ళాడతా సినిమాలో టబు నాగార్జున కి మంచి జోడిగా సెట్ అయ్యారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వీరందరితోనూ కింగ్ సీక్రెట్ వ్యవహారం కూడా నడిపినట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తుంటుంది. టబు అయితే నాగార్జున కోసం పెళ్ళి కూడా వద్దనుకున్నట్టు ఇప్పటికీ వార్తలు వస్తుంటాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news