Newsరాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్లు మిస్ అయిన బాల‌య్య‌..ఆ సినిమాలు...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్లు మిస్ అయిన బాల‌య్య‌..ఆ సినిమాలు ఇవే..!

నందమూరి బాలకృష్ణ – రాజమౌళి కాంబినేషన్లో ఒకటి కాదు ఏకంగా రెండు సూపర్ హిట్ సినిమాలు మిస్ అయ్యాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. 2003లో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా ముందు బాలయ్యతో చేయాలనుకున్నారు. స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాలయ్యకు కథ కూడా చెప్పారు. అప్పటికే బాలయ్య చాలాఫ్యాక్షన్ సినిమాలు చేసి ఉండడంతో పాటు అదే టైంలో బిగోపాల్ దర్శకత్వంలో పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చేస్తున్నారు.

వెంట వెంటనే ఫ్యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం లేక సింహాద్రి సినిమాను బాలయ్య వదులుకున్నారు. వెంటనే రాజమౌళి ఎన్టీఆర్ను కలిసి ఆ కథ చెప్పి ఎన్టీఆర్ తో సింహాద్రి తీసి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు రాజమౌళి.. రామ్ చరణ్ తో మగధీర సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాలో సీన్లు రాసుకునేటప్పుడు కూడా బాలయ్య తోనే చేయాలని రాజమౌళి బలంగా ఫిక్స్ అయ్యారు.

అదే టైంలో బాలయ్య ఆంధ్రాలో 2009 ఎన్నికలు.. ఇతర కారణాలతో బిజీబిజీగా ఉన్నారు. అప్పుడు కూడా రాజమౌళితో సినిమా చేయటం కుదరలేదు. ఆ సినిమా కూడా ఎంతో సూపర్ డూపర్ హిట్ అయింది. మగధీర ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో పాటు రామ్ చరణ్ కెరీర్ కు బలమైన పునాది వేసింది. అలా రెండుసార్లు రాజమౌళి – బాలకృష్ణ కాంబినేషన్లో రావలసిన రెండు సినిమాలు మిస్ అయ్యాయి.

అలా సింహాద్రి, మ‌గ‌ధీర ఈ రెండు సూపర్ డూపర్ హిట్లయ్యాయి. నిజంగా ఈ రెండు సినిమాలలో బాలయ్య నటించి ఉంటే బాలయ్య కెరీర్ లో మరపురాని సినిమాలుగా మిగిలిపోయి ఉండేవి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news