Moviesమ‌హేష్‌బాబు హీరోయిన్‌కు తీర‌ని బాధ‌... ఈ న‌ర‌కం ఎవ్వ‌రికి వ‌ద్దంటూ క‌న్నీళ్లు..

మ‌హేష్‌బాబు హీరోయిన్‌కు తీర‌ని బాధ‌… ఈ న‌ర‌కం ఎవ్వ‌రికి వ‌ద్దంటూ క‌న్నీళ్లు..

బాలీవుడ్ హీరోయిన్ బిపాషాబ‌శుకు పెద్ద కష్టం వచ్చింది. బిపాషా బశు తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. మహేష్ బాబు హీరోగా 2002లో జయంత్‌ దర్శకత్వంలో వచ్చిన టక్కరి దొంగ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. గత ఏడాది నవంబర్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తన పాపకు దేవీ అనే నామకరణం చేసింది. అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన గారాలపట్టికి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉన్నాయట.

ఈ విషయం తెలియడంతో తమ కుటుంబం అల్లకల్లోలం అయిందని.. కేవలం మూడు నెలల వయసులోనే దేవికి సర్జరీ చేశారంటూ బిపాషా కన్నీళ్లు పెట్టుకుంది. శనివారం తన ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన ఆమె తన ప్రెగ్నెన్సీ జర్నీతో పాటు… త‌ల్లిగా తాను ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేసింది. దేవి పుట్టిన మూడు రోజులకే తన గుండెలో రంధ్రాలు ఉన్నాయన్న విషయం తెలిసింది.. దాన్ని సరి చేయాలంటే సర్జరీ చేయాలని అన్నారు.

ఇలాంటి నరకం ఏ తల్లికి రాకూడదు.. కనీసం ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు.. ఆమె మా జీవితంలోకి రావడంతో ఎంతో ఘనంగా వేడుక చేసుకోవాలని అనుకున్నాం.. అయితే ఈ విషయం తెలియడంతో మా మనసు ముక్కలైపోయింది.. మొదటి 5 నెలలు మాకు చాలా కష్టంగా గడిచాయి.. అయితే దేవి మాత్రం మొదటి రోజు నుంచే ఎంతో హుషారుగా కనిపించేది.. తనకు మూడు నెలల వయసు ఉన్నప్పుడు స్కానింగ్ తీసుకువెళ్లాం… ఇంత చిన్న పాపకు హార్ట్ సర్జరీ అంటే చెప్పలేనంత బాధ వేసింద‌ని చెప్పింది.

అయితే భర్త కరణ్ కూడా ఆపరేషన్కు సిద్ధంగా లేడు. చివరకు 6 గంటల పాటు జరిగిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో అందరం ఊపిరిపీల్చుకున్నాం అంటూ బిపాషా కంటతడి పెట్టుకుంది. ఇక 2017లో లోవెన్ సినిమాలో కరణ్ సింగ్ గ్రోవ‌ర్‌తో ఆమె కలిసి నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఇష్క్ మొదలైంది. కొంతకాలం డేటింగ్ చేసిన వీరిద్దరూ 2016లో పెళ్లి పీటలు ఎక్కారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2018లో వచ్చిన వెల్కమ్ టు న్యూ ఇయర్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news