Moviesరామ్‌చ‌ర‌ణ్ VS ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య మ‌ళ్లీ ర‌చ్చ‌... ఆ అవార్డు...

రామ్‌చ‌ర‌ణ్ VS ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య మ‌ళ్లీ ర‌చ్చ‌… ఆ అవార్డు విన్న‌ర్ ఎవ‌రు.. !

సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమకు చెందిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ‌ని గుర్తించి వారందరికీ సైమా అవార్డులు ఇస్తూ ఉంటారు. సైమా అంటే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. సినిమా రంగంలో దీనికి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డుల కోసం పోటీపడుతున్న ఉత్తమ చిత్రాల జాబితాలను సైమా తాజాగా విడుదల చేసింది.

ఈ క్రమంలోనే ఉత్తమ హీరో నామినేషన్ల జాబితా రిలీజ్ చేసింది. తమిళ, కన్నడ విభాగానికి చెందిన హీరోల జాబితాను కూడా సైమా రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్టులోని పేర్లు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా ఉన్నాయి. ఇవి ఆయా హీరోల అభిమానుల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి. ఉత్తమ నటుల నామినేషన్స్ లో త్రిబుల్ ఆర్ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు మేజర్ సినిమా నుంచి అడవి శేషు – కార్తికేయ 2 నుంచి నిఖిల్ – సీతారామం సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ – డిజె టిల్లు సినిమా నుంచి సిద్దు జొన్నలగడ్డ పోటీలో ఉన్నారు.

ఈ జాబితాలో ఎంతమంది ఉన్నా ప్రధానంగా త్రిపుల్ ఆర్ హీరోల మధ్య గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు ? ఉత్తమ హీరోగా సైమా అవార్డు దక్కించుకుంటారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. మా హీరో సీన్లు సూపర్ అని.. మా హీరో పాత్రే అదిరిపోయింది అని.. మా హీరో యాక్షన్ బాగుందని ఎన్టీఆర్ చరణ్ అభిమానులు పోటీపడుతున్నారు.

ఈ విషయంలో సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానుల కంటే కాస్త ఎక్కువగానే కవ్వించారని చెప్పాలి. ఇక సినిమాలో తొలి భాగంలో ఎన్టీఆర్ అధిపత్యం ఉంటే రెండో భాగంలో రాంచరణ్ ఆధిపత్యం ఉంటుంది. ఇందులో ఎవరిని తక్కువ చేయలేదు.. రాజమౌళి ఇద్దరికీ సమన్యాయం చేశారు. అయితే సైమా అవార్డ్స్ జాబితాలో మళ్లీ ఇద్దరి పేర్లు ఉండడంతో ఈ టాపిక్ పై చర్చ జరుగుతుంది. మరి ఈ ఇద్దరిలో ఉత్తమ హీరో అవార్డు ఎవరు ? అందుకుంటారు తెలియాలంటే సెప్టెంబర్ 16 వరకు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news