Moviesభార్య న‌మ్ర‌త‌తో క‌లిసి మ‌హేష్ ఏం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి...

భార్య న‌మ్ర‌త‌తో క‌లిసి మ‌హేష్ ఏం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి ( ఫొటో)

మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ జంటలలో సూపర్ స్టార్ మహేష్ బాబు – భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ జంట ఒక‌రు. 2000లో బి. గోపాల్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన వంశీ సినిమా షూటింగ్ టైంలో ప్రేమ‌లో ప‌డ్డ ఈ జంట ఐదేళ్ల పాటు ప్రేమించుకుని 2005లో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్ద‌రు ఎప్పుడు విదేశీ వికేష‌న్లు ఫ్యామిలీతో స‌హా వెళ్లి మ‌రీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

మ‌హేష్ సినిమాల విష‌యంలో ఎంత బిజీ ఉన్నా కూడా వెకేష‌న్లు ఎంజాయ్ చేయ‌డంలో మ‌నోడి త‌ర్వాతే ఎవ‌రైనా. త‌న భార్య న‌మ్ర‌త విష‌యంలోనూ.. అలాగే త‌న పిల్లల పట్ల చూపే కేర్ కుటుంబంతో కలిసి గడిపే సమయం ఇవన్నీ చూసే ప్ర‌తి భార్య‌, భ‌ర్త‌కు తాము కూడా ఇలా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాల‌నేలా ఉంటాయి.

ఇక ప్ర‌స్తుతం ఈ జంట ఓ చిన్న వెకేషన్ లో ఉన్నారు. ఈ వెకేషన్ నుంచి మహేష్ .. తన భార్యతో కలిసి ఉన్న పిక్ షేర్ చేశాడు. ఈ ఇద్ద‌రు ఎంచ‌క్కా న‌వ్వులు చిందిస్తూ ఓ భారీ ఫైర్ వర్క్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news