Moviesదేవి VS తమన్: ఎవ్వరు డమ్మి.. ఎవ్వరు ఒరిజినల్.. ?

దేవి VS తమన్: ఎవ్వరు డమ్మి.. ఎవ్వరు ఒరిజినల్.. ?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించారు. ఐకాన్ స్టార్ అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప-ది రైజ్”లో ఆయన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ సినిమాలో అరు అర్జున్ గంధపు చెక్క కార్మికుడిగా, స్మగ్లర్‌ పాత్రను పోషించాడు. ఈ పాత్ర ప్రతి ఒక్కరిని ఎంతో మెప్పించింది.

ఈ క్రమంలోనే తెలుగు సినిమాలకు సంబంధించి ఏకంగా 10 అవార్డులు వచ్చాయి . కాగా ఉత్తమ నరుడిగా పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ అవార్డును అందుకోగా.. ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమా 6 కేటగిరీల్లో ఈ అవార్డును అందుకుంది . అంతే కాదు బెస్ట్ సినిమాగా ఉప్పెన అవార్డును దక్కించుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ అవార్డుల లిస్ట్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

అంతేకాదు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా పుష్ప సినిమాకు గాను దేవి శ్రీ ప్రసాద్ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకి ఎంతో కాంపిటేటర్ గా ప్రజెంట్ ఇండస్ట్రిలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న తమన్ పేరుని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు . ఆయన ఓ కాపీ రాజా అని.. కాపీ కొట్టి మ్యూజిక్ ట్యూన్స్ కంపోజ్ చేస్తాడని ..దేవి శ్రీ ప్రసాద్ 100 పర్సెంట్ నిజాయతి గల వాడు అని..అందుకే ఒక్క సినిమా చేసిన జెన్యూన్ గా చేస్తాడని .. అందుకే ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అని జాతీయ అవార్డు వరించిందని ట్రెండ్ చేస్తున్నారు . దీంతో మరోసారి సోషల్ మీడియాలో తమన్ – దేవి శ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news