Moviesజ్యూవెలరి యాడ్ కోసం సితార ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..? మహేశ్...

జ్యూవెలరి యాడ్ కోసం సితార ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..? మహేశ్ నే మించిపోయిందిగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో మహేష్ బాబు దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటివరకు పాన్ ఇండియా ఫిలిం చేయని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ స్దాయిలో ఫాలోయింగ్ దక్కించుకున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటే.. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా చేయకుండానే మహేష్ బాబు కూతురు పాన్ వరల్డ్ స్థాయి క్రేజీని దక్కించుకుంది.

ఎస్ .. రీసెంట్గా మహేష్ బాబు కూతురు సితార జ్యూవెలరీ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్లో పాల్గొనింది . మహేష్ బాబు గారాల పట్టి సితార తాజాగా పిఎంజే జ్యువెలరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ కోసం సితార ఎంత పారితోషకం తీసుకుందా..? అంటూ జనల్లో మాటలు మొదలైయాయి.

అయితే ఆమెని ఒక్క రూపాయి కూడా తీసుకొనివ్వలేదట మహేశ్. అయితే సదరు జ్యూవెలరీ సంస్ధ మాత్రం సితార కోసం గిఫ్ట్ కింద ఓ డైమండ్ హారాన్ని, రింగ్ అండ్ బ్రేస్లెట్ ని ఇచ్చారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు సితార నటించిన ఫస్ట్ యాడ్ రీసెంట్గా న్యూయార్క్ టైం స్క్వేర్ పై ఆవిష్కరించారు . దీన్ని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఏ మాటకు ఆ మాట సితార పాప కుందనపు బొమ్మలా ఉంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news