Moviesబాల‌య్య ఒక్క ఫోన్ కాల్‌తో హైద‌రాబాద్ ఫ్లైట్ ఎక్కిన న‌య‌న‌తార‌... షాకింగ్...

బాల‌య్య ఒక్క ఫోన్ కాల్‌తో హైద‌రాబాద్ ఫ్లైట్ ఎక్కిన న‌య‌న‌తార‌… షాకింగ్ స్టోరీ..!

న‌య‌న‌తార దాదాపుగా ద‌శాబ్దంన్న‌ర పాటు సౌత్ ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో లేడీ సూప‌ర్‌స్టార్‌గా దూసుకుపోతోంది. ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డ‌కు త‌ల్లి అయినా కూడా న‌య‌న్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌ట‌కీ ఆమెను త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకోవాల‌ని స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులే స్వ‌యంగా రిక‌మెండేష‌న్లు చేస్తున్నారు.

అస‌లు నాలుగైదేళ్ల క్రితం ఎంత గొప్ప స్టార్ హీరో, డైరెక్ట‌ర్ సినిమా అయినా కూడా ఆమె ప్ర‌మోష‌న్ల‌కు అస్స‌లు రానని మ‌రీ కండీష‌న్లు పెట్టి సినిమాలు చేసేది. అయినా ఆమె వెంటే ప‌డేవారు. అప్ప‌ట్లో ఆమె ఒక్కో సినిమాకు రు. 4 కోట్లు కూడా డిమాండ్ చేసేది. అస‌లు తమిళంలో వ‌రుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావ‌డంతో అస‌లు తెలుగు వైపే ఆమె చూసేదే కాదు.

ఎవ‌రో ఎందుకు వెంక‌టేష్ బాబు బంగారం సినిమాలో ఆమె న‌టించేందుకు సినిమా యూనిట్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింద‌ని ఇండ‌స్ట్రీ అంతా కోడై కూసింది. న‌య‌న్ దెబ్బ‌తో మారుతి, వెంకీ అయితే ఆ సినిమా షూటింగ్ జ‌రిగిన‌న్నీ రోజులు త‌ల‌లు ప‌ట్టుకున్నార‌ట‌. మొత్తానికి ఏదోలా మ‌మ అనిపించేసి షూటింగ్ పూర్తి చేసేశారు.

అదే టైంలో బాల‌య్య జై సింహా సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నారు. ఆమె అప్పుడున్న బిజీ షెడ్యూల్ వ‌ల్ల ద‌ర్శ‌కుడు కేఎస్‌. ర‌వికుమార్‌కు నో చెప్పేసింది. అయితే బాల‌య్య‌తో ఆమెకు ఎంతైనా స్పెష‌ల్ అనుబంధం ఉంది. ఆమె ఒకానొక టైంలో సినిమాలు మానేయాల‌ని అనుకుని బాల‌య్య‌తోనే శ్రీరామ‌రాజ్యం చేసింది. ఆ సినిమా షూటింగ్ టైంలో బాల‌య్య ఆమెను గౌర‌వించిన తీరుకు ఆమె ఎప్ప‌ట‌కీ ఫిదా అయిపోతూ ఉంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా చెప్పింది.

అప్ప‌టికే న‌య‌న్‌, బాల‌య్య కాంబోలో సింహా, శ్రీరామ‌రాజ్యం వ‌చ్చాయి. ఇక జై సింహా కోసం బాల‌య్య స్వ‌యంగా ఫోన్ చేయ‌డంతో న‌య‌న ఓకే చెప్పేసింది. బాల‌య్య మాట‌ను కాద‌న‌లేదు. వెంట‌నే డేట్లు స‌ర్దుబాటు చేసుకుని హైద‌రాబాద్‌కు వ‌చ్చిమ‌రీ ఆ సినిమాను కంప్లీట్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news