Moviesఒక్కసారిగా పారితోషకాలు పెంచిన శ్రీముఖి, రష్మి, సుమ .. ఎంత తీసుకుంటున్నారో...

ఒక్కసారిగా పారితోషకాలు పెంచిన శ్రీముఖి, రష్మి, సుమ .. ఎంత తీసుకుంటున్నారో తెలుసా..?

ఈ మధ్యకాలంలో వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా స్టార్స్ ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినీ తారలకు ఏమాత్రం మేము తీసిపోము అంటూ చెప్పుకొస్తున్నారు . శ్రీముఖి, రష్మి, సుమ వాళ్ళ పారితోషికం రేంజ్ ని పెంచేసారు. దీంతో ఒక్కసారిగా మేకర్స్ షాక్ అయ్యారు . కాగా అందుతున్న సమాచారం ప్రకారం అందరికన్నా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా శ్రీముఖి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఇప్పటివరకు అందరికన్నా హైయెస్ట్ పారితోషం తీసుకుంటున్న యాంకర్ గా ఫస్ట్ ప్లేస్ లో సుమ ఉండింది. కానీ రీసెంట్ గా పెరిగిన రెమ్యూనరేషన్ తో సుమ స్థానాన్ని రీప్లేస్ చేసింది యాంకర్ శ్రీముఖి. ప్రజెంట్ సుమ ఒక్కో షో కి లేదా ఈవెంట్ కి 80000 నుంచి లక్ష రూపాయలు వరకు పారితోషకం తీసుకుంటూ వచ్చింది . కాగా ఒక్కసారిగా ఆ సంఖ్యను 20000 పెంచేసి ఇప్పుడు ఒక్కొక్క షోకి 1,20,000 పైగానే తీసుకుంటుందట.

కాగా యాంకర్ శ్రీముఖి ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు 60000 పారితోషకం పెంచేసి గుండె ఘల్లుమనేలా చేసింది. గతం లో శ్రీముఖి ఒక్కో షో కి 80000 తీసుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు లక్ష యాభై వేలు దాకా పెరిగిపోయింది. అంతేకాదు ఈమె జడ్జిగా చేస్తున్న షో కి ఏకంగా ఆమె ఒక్క ఎపిసోడ్ కి రెండు లక్షలు ఛార్జ్ చేస్తుందట.

అందరికన్నా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బుల్లితెర రాణి గా శ్రీముఖి రికార్డ్ బద్దలు కొట్టింది . అంతేకాదు రష్మి కూడా తన రెమ్యూనరేషన్ ని పెంచేసింది. ఈ మధ్యకాలంలో రష్మి పాపులారిటి తగ్గిపోయింది . అయినా కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. పెరుగుతూనే ఉంది . దాదాపు రష్మి ఒక్క షో కి 60000 నుండి 70000 తీసుకుంటూ వచ్చేదట. ఇప్పుడు ఏకంగా దాన్ని లక్ష రూపాయలు చేసేసిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news