Moviesపెద్దవారు మీరు కూడా ఇలాంటివి చేస్తారా..రానా సినిమా పై సాయి పల్లవి...

పెద్దవారు మీరు కూడా ఇలాంటివి చేస్తారా..రానా సినిమా పై సాయి పల్లవి ఫుల్ ఫైర్..?

సాయి..పల్లవి పరిచయం అక్కర్లేని పేరు. చక్కటి పేరు..దానికి తగ్గ అందం..ఎప్పుడు అందరిని నవ్వుతూ పలకరించే పిలుపు..నచ్చినిది నచ్చిన్నట్లు చేసే ఈ అమ్మదు అంటే ఇండస్ట్రీలో చాలా మందికి గౌరవం ఇష్టం కూడా. నాచురల్ అందం, అంతకుమించి అన్నట్లుగా నాచురల్ స్టెప్పులతో ఫిదా చేయడంతో సాయి పల్లవిని మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. డబ్బు కోసం కాదు..తన కల కోసం..తన కంతృప్తి కోసం సినిమాలు చేస్తూ..నేను నటించే సినిమాలు అందరు కలిసి చూసుకునేలా ఉండాలేకాని..తిట్టుకునే ఉండకూడదు అంటూ ప్రతి సినిమాలో తన్ టెస్ట్ కు తగ్గట్లు క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ నెట్టుకోస్తుంది సాయి పల్లవి.

ఎక్స్ పోజింగ్ అనే పదానికి దూరంగా..నటన అనే పదానికి చాలా దగ్గరగా పాత్రలు చూస్ చేసుకుని సినిమాలు తీసేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్లల్లో సాయి పల్లవి ముందు ఉంటాది. అయితే సాయి పల్లవి ఏ విషయం లోనైనా చాలా కూల్ గా ఉంటాది. తొందర పడి ఏ విషయంలోను నోరు జారదు. ఆలోచించి మాట్లాడుతుంది. అలా మనం చాలా ఇంటర్వ్యుల్లో చూశాం. రీపోర్టర్స్ ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినా కానీ చాలా కూల్ స్మైల్ ఇస్తూనే ఆన్సర్ ఇస్తుంది.

అయితే, అలాంటి సాయి పల్లవి ఫస్ట్ టైం రానా సినిమా మేకర్స్ పై ఫర్ అయ్యిందట. మనందరికి తెలిసిందే..సాయిపల్లవి రానా ప్రధాన పాత్రలో చేస్తున్న విరాటపర్వం అనే సినిమాలో నటిస్తుంది. రానా, సాయి ప‌ల్లవి జంట‌గా డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ ‘విరాటపర్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో ‘రెవ‌ల్యూష‌న్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్’ అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌‌తో మూవీ రూపొందిస్తున్నారు. వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి రోల్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుంది అని టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకులముందుకు వస్తుందో అర్దం కావడంలేదు. మొన్న ఆ మధ్యనే సినిమాలో కొన్ని సీన్స్ ని రీ షూట్ చేశారంటూ వార్తలు వినిపించాయి. పోనీ ఇప్పటికైన రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారా అంతే..లేరు అనే సమాధానం వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి..షాకింగ్ మ్యాటర్ లీక్ అయ్యింది. రీ-షూట్స్ తర్వాత ఫైనల్ కట్‌ని సిద్ధం చేసిన మేకర్స్.. ఈ మధ్యనే చిత్రబృందానికి మాత్రమే స్పెషల్ స్క్రీనింగ్ వేశారట. సినిమా చాలా బాగా వచ్చిందట, ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మూవీ మేకర్స్. అయితే సాయి పల్లవి స్క్రీనింగ్ జరుగుతున్న సమయంలో సడెన్ గా లేచి చెప్పా చేయకుండా వెళ్ళిపోయిందట.

దీంతో షాక్ అయిన టీం..ఏమైంది అని ఆరా తీయ్యగా..అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. సినిమాలో ఆమె పై తీసిన సీన్స్ షూట్ వేరని..ఇచ్చిన ఫైనల్ అవుట్ పుట్ వేరని..తన క్యారెక్టర్ ని చెప్పిన్నప్పుడు ఒకలా చెప్పి..ఇప్పుడు మరోలా చూయించారని సాయి పల్లవి కి కోపం వచ్చిందట. అంతేకాదు మీలాంటి పెద్దవాళ్లు కూడా ఇండస్ట్రీలో ఇలాంటి పనులు చేయడం అసలు బాగోలేదు అంటూ..కాల్ కట్ చేసేసిందట. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఇప్పుడప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపించడం లేదు అంటున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news