Moviesటాలీవుడ్ గుస‌గుస‌: వాళ్లు చేసిన ప‌నితో మ‌హేష్‌కు కోపం వ‌చ్చిందా ?

టాలీవుడ్ గుస‌గుస‌: వాళ్లు చేసిన ప‌నితో మ‌హేష్‌కు కోపం వ‌చ్చిందా ?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు కోపం వ‌చ్చింద‌ట‌.. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అస‌లు విష‌యంలోకి వెళితే ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ చేద్దాం అని ముందుగా అనుకున్నారు. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు స‌డెన్‌గా అదే డేట్‌ను ఆచార్య రిలీజ్ చేస్తున్న‌ట్టు చెప్పారు. ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కావాల్సిన ఆచార్య క‌రోనా మూడో ఫేజ్ కార‌ణంగా వాయిదా ప‌డింది.

ఆచార్య ఏప్రిల్ 1న వేసుకోవ‌డంలో వ‌చ్చిన ఇబ్బంది లేదు.. కనీసం ఆ రోజు తాము త‌మ సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకున్నామ‌ని.. త‌మ‌కు ఒక్క మాట అయినా చెప్ప‌కుండా ఇలా చేయ‌డం ఏంట‌ని మ‌హేష్‌బాబుతో పాటు ఆ సినిమా యూనిట్ గ‌రంగ‌రంగా ఉంద‌ట‌. మ‌హేష్ సైతం ఫీల్ అయ్యాడ‌ని అంటున్నారు. అవ‌స‌రం అయితే మ‌నం కూడా అదే డేట్‌కు వెళ‌దామ‌ని.. అందుకు త‌గిన‌ట్టుగా సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌ని కూడా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

విచిత్రం ఏంటంటే ఆచార్య ద‌ర్శ‌కుడు ఇటు మ‌హేష్‌తో పాటు అటు స‌ర్కారువారి పాట సినిమా నిర్మాత‌లు మైత్రీ మూవీస్ వాళ్ల‌కు అత్యంత స‌న్నిహితుడు. మ‌రి ఈ గ్యాప్ ఎందుకు వ‌చ్చింది అన్న‌ది తెలియ‌డం లేదు. ఏదేమైనా స‌ర్కారువారి పాట ఏప్రిల్ 1 లేదంటే ఏప్రిల్ 14న రావ‌డం ఫిక్స్ అయిపోయింది. అయితే అంత‌కు ముందే ఆర్ ఆర్ ఆర్ వ‌స్తే మ‌ళ్లీ ఈ డేట్లు ఇలాగే ఉంటాయ‌న్న గ్యారెంటీ అయితే లేదు.

ఇక ప్ర‌భాస్ రాధేశ్యామ్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మార్చి 17న వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు. ఈ గోల‌లో అస‌లు ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు వ‌స్తుందో ? భీమ్లానాయ‌క్ ప‌రిస్థితి ఏంటో కూడా తెలియ‌ట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news