Moviesఅఖండ: ఆ పాట వస్తున్నప్పుడు సీట్లల్లో కూర్చోని అభిమానులు..!!

అఖండ: ఆ పాట వస్తున్నప్పుడు సీట్లల్లో కూర్చోని అభిమానులు..!!

నందమూరి బాల‌య్య – బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బొమ్మ దద్దరిల్లల్సిందే. అలాంటి క్రేజ్ ఉంది వీళ్లకు. ఇక వీరిద్ద‌రి కాంబోలో గ‌తంలో సింహా, లెజెండ్ సినిమాలు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కాంబోలో మూడో సినిమా గా వచ్చిన “అఖండ” కూడా భారీ విజయం సాధించడంతో ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రికార్డులు బద్దలు కొట్టింది. సుమారు యేడాదిన్న‌ర పాటు బాల‌య్య అభిమానుల‌ను ఊరిస్తూ వ‌చ్చిన ఈ సినిమా ఈ రోజు అలా థియేట‌ర్ల‌లోకి దిగిందో లేదో సూప‌ర్ హిట్‌టాక్ సొంతం చేసుకుంది.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన చిత్రం “అఖండ”లో లో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ అందం తో ఆకట్టుకుంటుంది. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఇక ఈ సినిమాలో అన్ని పాటలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో “జై బాలయ్య” అనే పాట థియేటర్లలో వస్తున్నప్పుడు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారట.

ఏ ఒక్క అభిమాని కూడా తమ సీట్లల్లో కూర్చోకుండా విజిల్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తున్నారట. ఈ గీతానికి బాలయ్య మాస్ స్టెప్పులు కేక పుట్టిస్తున్నాయి. షర్ట్​లతో వేసిన స్టెప్​కు అయితే థియేటర్లలో ఫ్యాన్స్​ రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య స్టేప్పులు అద్దిరిపోయాయి. నిజంగా నందమూరి అభిమానులకు బోయపాటి మాస్ ఫీస్ట్ అందించారనే చెప్పాలి.

మాస్ హీరోగా బాల‌య్య‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి శ్రీను త‌న‌దైన మార్కును చూపించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నారు. ఇక ఈ సినిమా చూసి బయటకి వచ్చిన అభిమానులు ఇది బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెబుతున్నారు. ఓవ‌రాల్‌గా అయితే మాస్ ప్రేక్ష‌కుల‌కు, బాల‌య్య అభిమానుల‌కు మాత్రం విజువ‌ల్ ఫీస్ట్ అని చెప్పక్క తప్పదు. ఇక ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్ర లో నటించాడు. . కాగా శ్రీకాంత్ రోల్ ని బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానం అధ్బుతంగా ఉందంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా లో పూర్ణ కీలక పాత్ర పోషించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news