Moviesయాక్సిడెంట్ వల్ల సాయిధరమ్‌ తేజ్‌ కు జరిగిన మంచి ఏంటో తెలుసా..?

యాక్సిడెంట్ వల్ల సాయిధరమ్‌ తేజ్‌ కు జరిగిన మంచి ఏంటో తెలుసా..?

మెగాస్టార్ మేనల్లుడు..సాయిధరమ్‌ తేజ్‌ హీరో గా ఎన్నో చిత్రాల్లో నటించి తన స్టాఇల్లో అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన చిత్రం “రిపబ్లిక్”. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చెస్కుంది. కలెక్షన్స్ పరంగా సినిమా ఫ్లాప్ అయినా..ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో మాత్రం మంచి విజయం సాధించింది.\

అయితే, గత వినాయక చవితి రోజున మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కు భారీ రోడు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా స్టోర్‌ వైపు బైక్ లో వెళ్తుండగా .. ఒక్కసారిగా స్కిడ్‌ అయి బైక్‌ పై నుంచి సాయిధరమ్‌ తేజ్‌ కొంద పడిపోయాడు. దీంతో ఆయన కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే స్థానికులు తేజ్‌ను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అనంతరం అపోలో హాస్పిటల్‌లో సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్‌ డిశ్చార్చ్‌ అయ్యారు. ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహిత వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం మేరకు సాయి ధరమ్‌ తేజ్‌ బాగా తగ్గిపోయారట. ఆయనను కలిసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం.. సాయి ఫస్ట్ మీద ఇప్పుడు చాలా సన్నగా కనిపిస్తున్నాడట. చాలా రోజుల నుండి లావు తగ్గడానికి ప్రయత్నిస్తున్న లావు తగ్గడం లేదని..కానీ ఈ యాక్సిడెంట్ వల్ల తేజు బాగా స్లిం అయ్యారని అంటున్నారు. ఈ యాక్సిడెంట్ వల్ల తనకు జరిగిన మంచి ఇదే అని అంటున్నారు. ‘రిపబ్లిక్’ సినిమాలో.. అంతకుముందు సోలో బ్రతుకే సో బెటర్, ప్రతి రోజూ పండగే చిత్రాల్లో తేజును చూసిన చాలామంది అతడి ఫిజిక్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news