Moviesక్రేజీ కాంబో : మరోసారి తెర పై త్రివిక్రమ్ తో స్టైలీష్‌స్టార్...

క్రేజీ కాంబో : మరోసారి తెర పై త్రివిక్రమ్ తో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌..!!

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇండ‌స్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత యంగ్ హీరోలలో బ‌న్నీయే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్నాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌నోడి క్రేజ్ అల వైకుంఠ‌పురంలో త‌ర్వాత డ‌బుల్ అయ్యింది.

ఇక అల్లు అర్జున్ ఇప్పుడు సౌత్‌లో పాపుల‌ర్ హీరో అయిపోయాడు. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగులో మాత్ర‌మే కాకుండా మ‌ళయాళం, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రం బన్నీ క్రేజీ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెర పై ఈ కాంబినేషన్ అదుర్స్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తరువాత ఇండస్ట్రీ లో సన్నిహితంగా ఉండే మరో అగ్ర హీరో అల్లు అర్జున్.

పవన్, మహేష్ తర్వాత త్రివిక్రమ్ మూడు సినిమాలు తీసిన ఏకైక హీరో బన్నీ నే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్.. వీళ్లిద్దరి సక్సెస్‌ఫుల్ అండ్ హ్యాట్రిక్ కాంబినేషన్.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలొచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో సూపర్ హిట్ కాంబోలో నాలుగో సినిమా రాబోతోందని హింట్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా త్వరలోనే ఓ సర్ప్రైజ్ రాబోతోందని తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ , సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ లతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు నాగవంశీ. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో తెరమీదకు రాబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news