Moviesపెళ్లి చూపుల్లో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు లక్ష్మీ ప్రణతి ఏం చేసిందో...

పెళ్లి చూపుల్లో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు లక్ష్మీ ప్రణతి ఏం చేసిందో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ ఈ షోను హోస్ట్ చేస్తుండడంతొ కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తారక్ లుక్,మాటలు..తారక్ కలుపుగోలుతనం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

కాగా ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం టీఆర్పీ లెక్కలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు 11.4 రేటింగ్ వచ్చింది. ఇప్పటి వరకూ ఇదే హయ్యెస్ట్ రేటింగ్. ఈ దెబ్బతో జెమిని టీవీ రేటింగ్ 290 నుంచి 400 వెళ్లింది. అంతేకాదు..‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తొలి మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా నాలుగో సీజన్‌కు చిరంజీవి వ్యాఖ్యాతగా చేసిన విషయం తెలిసిందే. ఇక ఋఏటింగ్ లో తారక్ వీళ్ల రికార్డ్ లు తుడుచేసి..ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇక ఈ షొలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి మాట్లాడుతూ.. “పెళ్లి చూపులు కు వెళ్లినప్పుడు ప్రణతి నాతో అసలు మాట్లాడలేదు. నేనే కలగజేసుకుని.. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగాను..? దానికి ఏం సమాధానం చెప్పలేదు.మాఖు నిశ్చితార్థం తరువాత పెళ్ళికి 8 నెలల గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా లక్ష్మీ ప్రణతి చాలా ప్రశ్నలు అడిగాను..కానీ.. నో ఆన్సర్. అప్పుడు అర్ధమైంది ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవడం ఎంత కష్టమో. అది తెలిసిన వాడు ప్రపంచాన్ని ఏలుతాడు”..అంటూ ఎన్టీఆర్ అనడంతో షోలో అందరు పక పకా నవ్వుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news