ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది.
ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజ్ టాలీవడ్లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయి పల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. ప్రస్తుతం ఫీల్గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.
పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై-సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మీడియా తో ముచ్చ్టించిన సాయి పల్లవి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. లవ్ స్టోరీ ఎక్కువగా రూరల్ ఏరియాలో జరిగిందని.. ఆర్మూర్ దగ్గర పిప్రీలో చేశామని తెలిపింది. అక్కడి జనం హీరోహీరోయిన్లనే తేడా లేకుండా మాతో మాట్లాడారని చెప్పుతూ కోవిడ్ సమయంలో.. రాత్రిపూట షూటింగ్ జరిగినా పాపం వాళ్లు విసుక్కోలేదని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ దగ్గర కూర్చొని ప్రేమగా చేయిపట్టుకుని మాట్లాడారని చెప్పుకొచ్చింది. గ్రామాలకు వెళ్తే అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుందని తెలిపింది సాయి పల్లవి.