Moviesలైవ్ లో టంగ్ స్లిప్ అయిన క్రేజీ హీరోయిన్..సస్పెన్స్ కి...

లైవ్ లో టంగ్ స్లిప్ అయిన క్రేజీ హీరోయిన్..సస్పెన్స్ కి బ్రేక్..?

రష్మిక.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్న వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. ప్రజెంట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్న ఈ భామా అటు బాలీవుడ్ ..ఇటు టాలీవుడ్ లోను వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ.. మధ్యలో కోలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది ఈ బ్యూటి. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో స్టార్ గా ఎదిగిన నటి రష్మిక మందన.. ఆ తరువాత తెలుగులో ‘ఛలో’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ‘గీత గోవిందం’ సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా తరువాత రష్మికకి టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే శర్వానంద్,నితిన్,మహెష్ బాబు,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీల సరసన నటించినా ఈ బ్యూటీ..త్వరలోనే యంగ్ టైగర్ ఎంటీఆర్ ప్రక్కన నటించబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఇన్స్టా లైవ్ లో కి వచ్చి తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆమె అభిమానులు రష్మిక తదుపరి సినిమాల వివరాలు అడిగి తెలుసుకుంటున్న క్రమంలో .. ఓ నెటిజన్ ఎన్టీఆర్, కొరటాల మూవీ ప్రాజక్ట్ గురించి చెప్పండి అని అడుగగా, తాను కూడా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

అంతే..ఇక ఆ మాటతో ఆమె ఆయనసినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది అంటూ కన్ఫర్మ్ చేసేసారు అభిమానులు. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే.. నిజానికి ఈ విషయం చాలా సస్పెన్స్ గా ఉంచారట కొరటాల..కానీ అమ్మడు లైవ్ లో ఇలా టంగ్ స్లిప్ అయ్యి సస్పెన్స్ కి బ్రేక్ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకార.. ఈ మూవి అఫిషియల్ ప్రకటన చేయనుందట ఆ మూవీ యూనిట్ .మరి ఈ వార్త కనుక నిజం అయితే తొలిసారిగా ఎన్టీఆర్ తో రష్మిక జోడీని తెరపై చూడవచ్చు. ఇక ఈ జంట తెర పై ఎలా అలరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news