Moviesఆ విషయంలో కోట్లు ఖర్చు చేస్తున్న ఈ జంట.. హాట్ టాపిక్...

ఆ విషయంలో కోట్లు ఖర్చు చేస్తున్న ఈ జంట.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ కపుల్స్..?

దీపికా పడుకోణె .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో,తన నటనతో ఎంతో మందిని ఎంటర్ టైన్ చేస్తూ..కోట్లాది మంది ప్రేక్ష్స్కులను సంపాదించుకున్న క్రేజీ బ్యూటీ. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈమె..బాలీవుడ్‌లో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తో చాలాకాలం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇక వన్ ఫైన్ డే ఈజంట అందరిముందు ఓపెన్ అయిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ జంట వివాహ బంధంతో ఒకటైయ్యారు.

2018లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అబ్బో..అప్పట్లో ఎక్కడ చూసిన వీళ్లకు సంబంధించిన వార్తలే కనిపించాయిలేండి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌,ప్రొఫెష‌న‌ల్ లైఫ్ చాలా సాఫీగా న‌డుస్తుంది. ఇక రణ్‌వీర్ ప్రస్తుతం ‘83’తో పాటు పలు బడా సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉండగా.. ఆయన భార్య దీపికా కూడా రణ్‌వీర్‌తో కలిసి ‘83’ సినిమాలో నటిస్తూనే.. పఠాన్, సర్కస్, సినిమాలతో పాటు.. తెలుగులో యంగ్‌ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన, నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది. తాజాగా స్టార్ కపుల్స్ గా పేరు పొందిన జంట రణవీర్ సింగ్ – దీపికా పదుకొణే పేర్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

దానికి రీజన్.. వాళ్ళు ఓ ఖరీధైన బంగ్లా కొనుకోవడమే. ఖరీధైన బంగ్లా అంటే.. ఏ 5, 6 కోట్లు పోసి కొనడం కాదు..వీళ్ళు ఏకంగా 25 కోట్లు పెట్టి ఓ బంగ్లా కొనుకున్నారటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది. ముంబాయిలోని కోస్టల్ టౌన్ ఆలీబాగ్ ఏరియలో ఈ బంగ్లాని కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఏరియాలోనే ఇంతకుముందు పలువురు బాలీవుడ్ బడా స్టార్ కూడా ఆస్తులను కలిగి ఉన్నట్లు టాక్. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు దీపిక,రణవీర్.. ఈ బంగ్లా కొనుగోలుతో అక్కడ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news