Newsషాకింగ్: నేను ఏం చేయలేదు.. అంతా "వాడే" చేసాడు "నాకొడుకు"..?

షాకింగ్: నేను ఏం చేయలేదు.. అంతా “వాడే” చేసాడు “నాకొడుకు”..?

రాజమౌళి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో ఓటమి లేని దర్శకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు..రాజమౌళి. దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి, తెలుగు సినిమా ఖ్యాతిని నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు. ప్రస్తుతం ఆర్ఆర్ ఆర్ మూవీ తో మరో బ్లా బస్ట్ కు రెడీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “RRR” సినిమా కోసం యావత్ టాలీవుడ్ ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్‌తో పాటు ఇతర భాషల ఆడియెన్స్ కూడా చాలా ఆశగా చూస్తున్నారు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో తారక్, చరణ్‌లు నటిస్తున్న విషయం చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

ఈఇటీవల ఈ సినిమా నుంచి దోస్తీ అంటూ సాగే మొదటి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాటను హేమచంద్ర ఆలపించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ పాటతో మరోసారి కీరవాణి తన సత్తా చాటారు. తన అధ్భుతమైన సంగీతంతో అందరిని అందరిని మెస్మరైజ్ చేశారనే చెప్పాలి.

అలాగే ఈ పాటలో సీతారామశాస్త్రి సాహిత్యం ప్రతీ లైన్ ను అద్భుతంగా రాశారు. ఈ పాట తాజాగా విడుదల అయ్యి ప్రేక్షకులను మరింత విశేషంగా ఆకట్టుకుంటుండగా దీని చిత్రకరణ క్రెడిట్ మొత్తం రాజమౌళి తన కొడుకు ఎస్ ఎస్ కార్తికేయకు ఇచ్చేశారు. మ్యూజిక్ వీడియో తీయాలనే ఆలోచన తన కుమారుడు కార్తికేయదే అని రాజమౌళి తెలిపారు. ఇక ఈ పాటకు వస్తున్న స్పందన చూసి చాలా చాలా సంతోషపడ్డాను అని తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news