Moviesఊహించని షాక్ ఇచ్చిన ఛార్మి.. ఫుల్ డిసపాయింట్‌మెంట్‌ లో ఫాన్స్..!!

ఊహించని షాక్ ఇచ్చిన ఛార్మి.. ఫుల్ డిసపాయింట్‌మెంట్‌ లో ఫాన్స్..!!

అప్పుడెప్పుడో 2001లో సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీకి ఒకానొక ద‌శ‌లో స్టార్ హీరోల‌తో కూడా మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, నితిన్ లాంటి వాళ్లు ఆమెకు మంచి ఛాన్సులు ఇచ్చారు. మధ్య‌లో అంద‌రూ ఛార్మీని మ‌ర్చిపోయిన టైంలో ఆమె మంత్ర‌తో స‌క్సెస్ అందుకున్నారు. త‌ర్వాత వ‌రుస ప్లాపులు వెంటాడాయి. చివ‌ర‌కు జ్యోతిల‌క్ష్మి సినిమాలో ఆమె న‌టించ‌డంతో పాటు స‌రికొత్త‌గా నిర్మాత అవ‌తారం కూడా ఎత్తింది. అప్ప‌టి నుంచి ఆమె న‌ట‌న‌కు పూర్తిగా స్వ‌స్తి చెప్పి నిర్మాత అవ‌తారం ఎత్తేసింది.

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌లో క‌లిసి వ‌రుస‌గా సినిమాలు తీస్తోంది. పూరి తీసే సినిమాలు అన్నింటికి ఆమె స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అయిన ఈ ముదురు ముద్దుగుమ్మ‌కు ఆమె అభిమానులు మాత్రం మీకు ఏమైంత వ‌య‌సు అయిపోయింది.. మ‌రోవైపు అనుష్క‌, కాజ‌ల్ ఈ వ‌య‌స్సులో కూడా స్టార్ హీరోల‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.. మీరు కూడా చేయ‌వ‌చ్చ‌ని ఆమెకు సోష‌ల్ మీడియాలో సూచిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరి తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా కు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను కూడా ఆమెనే చూసుకుంటుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు సైలెంట్ గానే తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది.

ఎప్పుడు సోషల్ మీడియాలో యక్టివ్ గా ఉండే ఈ అమ్మడు… షూటింగ్ ల్లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఛార్మి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా పోస్ట్ చేసింది. అయితే పూర్తిగా కాదని.. త్వరలోనే మళ్లీ కలుద్దామన్నట్లుగా బై బై చెప్పేసింది.

అయితే ఉన్నట్లు ఉండి ఆమె సోషల్ మీడియాకు దూరం అవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు లైగర్ సినిమా అప్ డేట్స్ ను ఎవరు ఇస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారను. ఛార్మి తీసుకున్న నిర్ణయంను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఛార్మి ఏం చేస్తుందనేది వేచి చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news