Moviesనా లైఫ్ లో తీసిన పరమ చెత్త సినిమా అదే..పూరి షాకింగ్...

నా లైఫ్ లో తీసిన పరమ చెత్త సినిమా అదే..పూరి షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 21 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యింది. 2000 ఏప్రిల్ 20వ తేదీన బద్రి సినిమారిలీజ్ అయ్యింది. కెరీర్ ఆరంభంలోనే పూరి..ఏకంగా అప్ప‌ట్లో స్టార్ హీరోగా ఉన్న వ‌ప‌న్ క‌ళ్యాణ్‌తో సినిమాచేయ‌డం. అప్ప‌ట్లోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న అమీషా ప‌టేల్ ఆ సినిమాలో హిరోయిన్ గా చేయడాని ఒప్పుకోవడం…. ఇక ఆ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా ఉన్న్ రేణు దేశాయ్ తరువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీవితభాగ‌స్వామి కావ‌డం లాంటి ఎన్నో సంచ‌ల‌నాలు ఈ సినిమాతో న‌మోదు అయ్యాయి.

బద్రి సినిమా తరువాత్ ..పూరి ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. పూరి సినీఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. పూరి జగన్నాథ్ కి కథ నచ్చితే ఏది ఆలోచించకుండా సినిమాలు తీస్తాడు.

టాలీవుడ్ లో పూరిజగన్నాథ్ సినిమాకు ఓ క్రేజ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. పూరి సినిమాల్లో చెప్పే డైలాగ్స్ కుర్రాళ్ళు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. హీరోలను డిఫరెంట్ స్టైల్ లో చూపించడం లో పూరి దిట్ట.

పూరిజగన్నాథ్ టాలీవుడ్ లో ది మోస్ట్ క్రేజీ డైరెక్టర్ అన్న విషయం తెలిసిందే. విభిన్న కోణాలలో ట్రెండుకు తగ్గట్టుగా కథలను తెర మీద చూపించడంలో పూరి స్టైల్ ఇంకెవరికీ రాదు. ఆయనని ఫాలో అవగలరేమో గాని ఆయన మేకింగ్ స్టైల్ లో మాత్రం సినిమా తీసే దర్శకుడు ఇప్పటి వరకు లేడనే చెప్పాలి. అలాగే ఆయన హీరో హీరోయిన్స్ ని ఎంచుకునే విషయంలో కూడా కథ కి తగ్గట్టు కాంప్రమైజ్ కాకుండా ఎంచుకుంటాడు. అలాంటి క్రేజీ కాంబినేషన్ మన పూరి జగన్నాధ్ – రవితేజ లది అని అందరికీ తెలిసిందే.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రవితేజ తో దేవుడు చేసిన మనుషులు సినిమా తో పాటు చాలా సినిమా లు తెరకెక్కించాడు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ మూడు సినిమాలు కాకుండా నేనింతే, దేవుడు చేసిన మనుషులు సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కాయి. అయితే వీటిలో అన్ని సినిమాలకు మంచి పేరు వచ్చిన దేవుడు చేసిన మనుషులు సినిమా మాత్రం దారుణమైన ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాలో పాయింట్ ను సరిగ్గా చెప్పలేక పోయాను అని తన లైఫ్ లో తీసిన చెత్త సినిమా ఇదేనని చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్లోనే అత్యంత లాభాలను తెచ్చిపెట్టింది.

పూరి ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నాడు పూరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news