Moviesప‌వ‌న్ బ‌ర్త్ డే మ‌రో విషాదం... 8 మంది అభిమానులు మృతి

ప‌వ‌న్ బ‌ర్త్ డే మ‌రో విషాదం… 8 మంది అభిమానులు మృతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున మరో విషాదం చోటుచేసుకుంది. మరో ఐదుగురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. గ‌త రాత్రి చిత్తూరు జిల్లా శాంతిపురంలో ప‌వ‌న్ ఫ్లెక్సీలు క‌డుతూ ముగ్గురు అభిమానులు క‌రెంట్ షాక్‌తో మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్ర విష‌మ ప‌రిస్థితుల్లో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం నుంచి కోలుకోక‌ముందే మ‌రో ఐదుగురు అభిమానులు కూడా మృతి చెంద‌డంతో ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్ డే వేళ కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ అంద‌రూ తీవ్ర విషాదంలో మునిగి పోయారు.

ప‌వ‌న్ పుట్టిన రోజు సెల‌బ్రేట్ చేసుకోవాల‌నుకున్న ఐదుగురు అభిమానులు కారులో వెళుతుండ‌గా ఈ ఐదుగురు స్నేహితుల‌ను లారీ రూపంలో మృత్యువు క‌బ‌లించింది.  వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరు ప‌వ‌న్ బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకునేందుకు కారులో ప‌ర‌కాల వెళుతున్నారు. వీరు ప్ర‌యాణిస్తోన్న కారును కాళేశ్వ‌రం నుంచి వ‌స్తోన్న ఇసుక లారీ ఢీ కొట్ట‌డంతో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

ఇక లారీ డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తు వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అంటున్నారు.  కారు నుజ్జునుజ్జు కావడంతో ఐదుగురి మృతదేహాలను బయటకు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. మృతులు వరంగల్ పోచమ్మమైదాన్ వాసులుగా గుర్తించారు. ఏదేమైనా ప‌వ‌న్ బ‌ర్త్ డే నాడు మొత్తం 8 మంది అభిమానులు చ‌నిపోవ‌డం నిజంగా బాధాక‌రం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news