Politicsబ్రేకింగ్‌: ఏపీ పోలీసులు విచారిస్తోన్న మ‌మ‌త ఎవ‌రు... టీడీపీతో లింక్ ఉందా...!

బ్రేకింగ్‌: ఏపీ పోలీసులు విచారిస్తోన్న మ‌మ‌త ఎవ‌రు… టీడీపీతో లింక్ ఉందా…!

విజ‌య‌వాడ‌లోని ర‌మేష్ ఆసుప‌త్రి కోవిడ్ కేర్‌గా ఉన్న స్వ‌ర్ణ ప్యాలెస్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఏకంగా 10 మంది వ‌ర‌కు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఆసుప‌త్రి మేనేజ్‌మెంట్‌లో కీల‌కంగా ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కోడ‌లు రాయ‌పాటి మ‌మ‌త‌కు పోలీసులు 160 సీ ఆర్ పీ సీ నోటీసులు ఇచ్చారు. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న ఆమె విచారణ కోసం ఈ రోజు విజ‌య‌వాడ‌లోని సౌత్ ఏసీపీ కార్యాల‌యానికి వ‌చ్చారు. ప్ర‌స్తుతం మ‌మ‌త నుంచి ఏసీపీ సూర్యచంద్రరావు వివరాలు సేకరిస్తున్నారు.

 

ఈ విచార‌ణ‌లో భాగంగా అస‌లు హాస్ప‌ట‌ల్ వారు కోవిడ్ రోగుల‌ను ఎలా అడ్మిట్ చేసుకుంటున్నారు ? వీరికి అనుమ‌తి ఉందా ? అనే విష‌యాల‌పై ఆమెను విచారిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక కోవిడ్ ఫేషెంట్ల నుంచి ఎంత అమౌంట్ వ‌సూలు చేస్తున్నార‌న్న దానిపై కూడా విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ హాస్ప‌ట‌ల్ మేనేజ్‌మెంట్‌లో మ‌మ‌త కీల‌కంగా ఉన్నార‌ని కూడా తెలుస్తోంది. మరో పక్క పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి ఛైర్మెన్ రమేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. కేవలం రమేష్ పరారీలో ఉండటం వల్లే మానేజ్మెంట్, డాక్టర్లను విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news