Moviesసరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్.. అదిరింది భయ్యా!

సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్.. అదిరింది భయ్యా!

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ అంచనాలను క్రియేట్ చేసుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. మహేష్ బాబుకు ఎందుకంత క్రేజ్ ఉందో ఈ సినిమా చూస్తే మరోసారి తెలుస్తోందని సన్సార్ సభ్యులు తెలిపారట. ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌ తమకు చాలా బాగా నచ్చిందని, దర్శకుడు ఈ సినిమాను ప్రేక్షకుల అభిరుచి మేరకు చాలా చక్కగా తెరకెక్కించాడంటూ వారు పొగిడారట. ఇక మహేష్ యాక్టింగ్ ఈ సినిమాలో మరో లెవెల్‌లో ఉందని వారు కితాబిచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా ఈ సినిమాను సంక్రాంతి లాంటి పండగ సీజన్‌లో రిలీజ్ చేయడంతో సినిమా కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news