Gossipsబాలీవుడ్‌పై కన్నేసిన రౌడీ

బాలీవుడ్‌పై కన్నేసిన రౌడీ

టాలీవుడ్‌లో రౌడీగా పేరొందిన హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ట్రెండ్ సృష్టించిన విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీని క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు విజయ్. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా నిర్మాత అయిన ఛార్మీ ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టిందట. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌తో తాజాగా చార్మీ చర్చలు జరిపినట్లు, పాన్ ఇండియా సబ్జెక్ట్ కావడంతో ఆయన కూడా విజయ్ దేవరకొండ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ దారిలో విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయమని అంటున్నారు రౌడీ ఫ్యాన్స్. ఏదేమైనా పూరీ-విజయ్ దేవరకొండ కాంబో అనగానే పిచ్చ క్రేజ్ ఏర్పడిన మాట మాత్రం వాస్తవం అని చెప్పాలి. మరి వీరిద్దరు కలిసి ఎలాంటి సినిమాతో మనముందుకు వస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news