Moviesఆ హీరోయిన్ తో మాట్లాడకు..ఐశ్వర్య రాయ్ కు వార్నింగ్ ఇచ్చిన మణిరత్నం..ఎందుకంటే..?

ఆ హీరోయిన్ తో మాట్లాడకు..ఐశ్వర్య రాయ్ కు వార్నింగ్ ఇచ్చిన మణిరత్నం..ఎందుకంటే..?

పోనియన్ సెల్వన్.. ఈ సినిమాపై భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . నిజం చెప్పాలంటే దీన్ని తమిళ్ బాహుబలి అంటూ ప్రచారం చేస్తున్నారు. అంతటి రేంజ్ లో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో భారీతారాగానం నటిస్తుంది. స్టార్స్ అయిన ఐశ్వర్యరాయ్ ,త్రిష, కార్తీ, జయం రవి ..ఇలాంటి బిగ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండడం సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది.

కాగా, పోనియన్ సెల్వన్ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ను సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా స్పీడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు మణిరత్నం. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టాడు. దీంతో ఐశ్వర్యరాయ్, త్రిష అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ..” త్రిష-ఐశ్వర్యారాయ్ మధ్య వచ్చే సీన్స్ గురించి తెరకెక్కించేటప్పుడు చాలా కష్టపడ్డాను” అంటూ చెప్పుకు రావడం సంచలనంగా మారింది.

ఆయన మాట్లాడుతూ..” ఈ సినిమాలో ఇద్దరు సీరియస్ రోల్స్ లో కనిపిస్తారు. ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు కూడా సీరియస్ గానే ఉండాలి. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా సెట్స్ లో సీరియస్ నెస్ తీసుకురాలేకపోయాను. దీంతో నేనే ఈ సినిమా పూర్తి అయ్యే వరకు వారిద్దరిని మాట్లాడుకోవద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. అయినా కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చేసి సీన్స్ తెరకెక్కించేటప్పుడు నాకు చాలా టైం పట్టింది “అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమా కోసం మణిరత్నం ఎంత కష్టపడ్డాడో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .మరి చూడాలి ఈ తమిళ్ బాహుబలి ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news