Newsశ్రీవారి సేవలో సింధూ

శ్రీవారి సేవలో సింధూ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రియో ఒలంపిక్ విన్నర్ పీవీ సింధు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో కుటుంబ సభ్యులు, బ్యాట్మింటన్ కోచ్ పుల్లెంల గోపీచంద్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. 68 కిలోల బెల్లంతో శ్రీవారికి తులాభారం మొక్కు చెల్లించుకుంది సింధు. అంతకుముందు టీటీడీ అధికారులు,పాలకమండలి సభ్యులు ఆలయం దగ్గర వీరికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు సింధూకు ఆశీర్వచనాలు ఇచ్చారు.

28ad76ea-8a6e-4edd-afc1-eb7d471ced04 4fdfbe6e-d3d3-404b-9076-095ef633b4fb

Latest news