Movies"నేను ఏం పాపం చేశాను".. కన్నీళ్లు తెప్పిస్తున్న చంద్ర మోహన్ ఆఖరి...

“నేను ఏం పాపం చేశాను”.. కన్నీళ్లు తెప్పిస్తున్న చంద్ర మోహన్ ఆఖరి మాటలు..!!

టాలీవుడ్ సీనియర్ నటుడిగా పాపులారిటీ సంపాదించుకున్న చంద్రమోహన్ నేడు ఉదయం 9:45 నిమిషాలకు తుది శ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్నారు . ఈ క్రమంలోనే గుండెకు సంబంధించిన చికిత్స తీసుకోవడానికి అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు . 9: 45 నిమిషాలకు హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ లో తుది శ్వాస విడిచారు చంద్రమోహన్ .

ఇదే క్రమంలో ఆయనకు సంబంధించిన కొన్ని పాత వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . చంద్రమోహన్ లాస్ట్ గా ఫిబ్రవరి రెండవ తేదీ మీడియా ముఖంగా మాట్లాడారు . అది కూడా కే విశ్వనాథ్ మరణించిన టైంలో ఆయన పార్ధివ దేహం వద్దకు వచ్చి చూసి విలపించి అనంతరం మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రమోహన్ కు విశ్వనాథ్ పెదనాన్న కొడుకు అవుతారు. ఈ విషయాన్ని స్వయాన ఆయనే వివరించారు . విశ్వనాధ్ చనిపోయినప్పుడు చంద్రమోహన్ చిన్నపిల్లాడిలా ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అంతేకాదు ఆయన పార్ధీవ దేహం చూసిన అనంతరం చంద్రమోహన్ మీడియాతో మాట్లాడుతూ..” కే విశ్వనాథ్ గారు స్వయాన నా పెదనాన్న కొడుకు .ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా కజిన్ .. మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువగా ఉండేది.. ఆయనకు నేను చాలా దగ్గర వాడిని .. నేను అన్నయ్య 25 ఏళ్లు పక్కపక్కనే ఉన్నాం..ఒకే చోట స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకొని పక్కపక్కన ఇళ్లలోనే ఉండేవాళ్ళం .. నా సినీ కెరియర్ ఎలా ఉండడానికి కారణం విశ్వనాథ్ గారే.. ఆయనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మా కుటుంబాలకు ఆయన మరణం తీరని లోటు “అంటూ ఎమోషనల్ అయినా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఆయన ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు . కె.విశ్వనాథ్ మరణించిన ఏడాది తిరగకముందే చంద్రమోహన్ కూడా మరణించడం ఫ్యాన్స్ కు తీవ్ర శోకాన్ని మిగిల్చింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news