News' భగవంత్ కేస‌రి ' సినిమాకు పోటీగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్...ఫ్యాన్స్...

‘ భగవంత్ కేస‌రి ‘ సినిమాకు పోటీగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్…ఫ్యాన్స్ వార్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి సినిమా దసరా కానుకగా ఈ నెల 19న థియేటర్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి వీర సింహారెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఎనిమిది నెలల గ్యాప్‌లోనే మరోసారి భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. వరుస సూపర్ డూపర్ హిట్‌లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు గత కొన్ని సంవ‌త్స‌రాలుగా నందమూరి కుటుంబంలో బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య అంతగా సఖ్యత లేదన్న ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు కూడా బాబాయ్, అబ్బాయి మధ్య వాతావరణం అంత సానుకూలంగా లేదనే చెబుతున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఈనెల 19న రిలీజ్ అవుతున్న బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాపై పోటీగా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా అదుర్స్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అదుర్స్ సినిమా నిర్మాతలు ఇద్దరు కొడాలి నాని- వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కొడాలి నాని వైసీపీ నుంచి గెలవగా.. వల్లభనేని వంశీ టిడిపి నుంచి గెలిచి ఆ తర్వాత వైసిపి చెంత చేరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరిద్దరూ కావాలని పట్టుబట్టి అదుర్స్ సినిమాను బాలయ్య సినిమాపై పోటీగా చేయించేలా ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం, అవాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే నందమూరి అభిమానుల్లో ఎన్టీఆర్- బాలయ్య అభిమానుల మధ్య మాటల తూటాలు పేల‌టం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news