సినిమా ఇండస్ట్రీలో అక్కినేని సుమంత్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడంటే ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు కానీ.. కెరియర్ స్టార్టింగ్ లో సుమన్ లవర్ బాయ్ గా టైప్ చేయించుకొని మరి అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నాడు . కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా హిట్లను కొట్టిన సుమంత్ ఆ తర్వాత హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న కొంతకాలానికి వీళ్ళు విడాకులు తీసుకొని అభిమానుల కి షాక్ ఇచ్చారు.

కాగ ఎంతో చూడ చక్కగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే విడాకుల తర్వాత సుమంత్ రెండో పెళ్లి ధ్యాసే చేయలేదు. సినిమా ఇండస్ట్రీకి కూడా కొంతకాలం దూరమయ్యాడు . ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు రకాల పాత్రలతో బిజీ అయ్యాడు . అయితే కీర్తి రెడ్డి మాత్రం బెంగళూరుకి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

అంతేకాదు విడాకులు తీసుకున్న వీళ్ళిద్దరూ ఇప్పటికి ఫోన్లో మాట్లాడుకుంటున్నారని.. చాట్ చేస్తారని .. స్వయంగా సుమంత్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమంత్ కి తన విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది . “ఈ క్రమంలోనే వర్కౌట్ అవుతుంది అనుకున్నాం.. పెళ్లి చేసుకున్నాం కుదరలేదు .. విడాకులు తీసుకుని విడిపోయినా కానీ మేము మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాం .. ఇప్పటికే కీర్తితో నేను ఫోన్లో మాట్లాడుతాను ..చాట్ చేస్తాను ..బర్త్ డే కి విష్ చేస్తాను.. మేము మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాం “అంటూ చెప్పుకు వచ్చారు. దీంతో విడాకులు తీసుకున్న ఫ్రెండ్స్ గా ఉండడం ఎలా సాధ్యం అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే సుమంత్ కు ఉన్న పెద్ద మనసుతో ఆలోచిస్తే ప్రతిదీ సాధ్యమే అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!