కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ – సన్ పిక్చర్స్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా కూలి. రజనీకాంత్ .. నాగార్జున తో పాటు అన్ని భాషల్లో హేమాహేమీలు అయిన నటులు నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ ఇది. తెలుగు హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ సైతం ఓ గెస్ట్ రోల్లో కనిపిస్తాడని టాక్ ? ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొంది. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల థియేటర్ హక్కులు కోసం ఏకంగా 42 కోట్ల మేరకు ఆఫర్ వెళ్ళిందని తెలుస్తోంది.కూలీ తెలుగు రైట్స్ కోసం హీరో నాగార్జునతో పాటు సితార నాగవంశీ తో పాటు … బడా డిస్ట్రిబ్యూటర్లు ఆసియన్ సునీల్ – దిల్ రాజు కూడా పోటీపడుతున్నారు. వీళ్లందరు మంచి రేట్లే పెడుతున్నా అందరికంటే ఎక్కువుగా నాగ వంశీ రు. 42 కోట్ల మేరకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. కూలీ ఆగస్టు 15 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకు ఒకరోజు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసిన నటించిన వార్ 2 సినిమా రిలీజ్ ఉంది. మరి గట్టి పోటీ మధ్యలో వస్తోన్న కూలీ ఏం చేస్తాడో ? చూడాలి.
రజనీ కాంత్ ‘ కూలీ ‘ హక్కులకు తెలుగులో ఇంత పోటీయా… టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఖర్చీఫ్…!
