టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి ఏకంగా మూడు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ – రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ – వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక బాలయ్య డాకు మహారాజ్ విషయానికి వస్తే ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. బాబి దర్శకుడు .. ఇదిలా ఉంటే డాకూ మహారాజ్ విడుదలకు పది రోజులు ముందు సంగీత దర్శకుడు తమన్ తన వర్క్ పూర్తి చేసి దర్శక నిర్మాతలకు సినిమా చూపించారు.దీనిపై నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో స్పందిస్తూ తన రివ్యూ ఇచ్చారు. ఇప్పుడే డాకు మహారాజ్ స్కోర్ చూశాను. ఒక్కటే ఒక్క మాట… సూపర్ …. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనే విధంగా ఫైర్ బ్లాస్ట్ ఎమోజిలు పోస్ట్ చేశారు… అందరూ జనవరి 12వ తేదీ వరకు వెయిట్ చేయండి. ఎవరు ఊహించని విధంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా బ్రదర్ తమన్ బ్లాక్ బస్టర్ స్కోర్ డెలివర్ చేశాడు.. థియేటర్లలో శివతాండవమే అమ్మా అంటూ సూర్యదేవర నాగ వంశీ ట్వీట్ చేశారు.
డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ మరోసారి కథానాయికగా నటించారు. మరొక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు.
‘ డాకూ మహారాజ్ ‘ ఫస్ట్ రివ్యూ… బాలయ్య శివ తాండవం.. పూనకాలు లోడింగ్..!
