Movies"కావాలంటే ఎవ్వరైనా ఎంక్వైరీ చూసుకోండి ..నాకేం భయం లేదు"..వేణు స్వామీ సెన్సేషనల్...

“కావాలంటే ఎవ్వరైనా ఎంక్వైరీ చూసుకోండి ..నాకేం భయం లేదు”..వేణు స్వామీ సెన్సేషనల్ స్టేట్మెంట్..!

ఈ మధ్యకాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఆయన చెప్పిన జాతకాలు తూచా తప్పకుండా జరిగేటివి అనే నమ్మకం జనాలలో ఉండేది . కానీ రాను రాను అది బాగా నశించిపోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఏపీలో జరిగిన ఎలక్షన్స్ విషయంలో వేణు స్వామి ప్రిడక్షన్ టోటల్గా రాంగ్ అయింది .ఆయన కేసీఆర్ అధికారం చేపడతాడు అని చెప్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపడతాడు అని చెప్తే నారా చంద్రబాబునాయుడు సీఎం అయ్యాడు .

ఈ క్రమంలోనే ఆయనపై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . అంతేకాదు ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆయన బయటపెద్దగా కనిపించడం లేదు. అంతేకాదు ఆయన ఇకపై ప్రిడక్షన్స్ చెప్పను అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అయినా సరే వేణు స్వామిని వదలట్లేదు కొందరు ఆకతాయిలు. దీంతో వేణు స్వామి సంచలన ప్రకటన చేశారు .. “చూస్తూనే ఉన్నాను ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి నాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది ..ఎందుకో అర్థం కావడం లేదు .. ఆఫ్కోర్స్ నాకు ట్రోలింగ్స్ కొత్తవి కాదు.. నేను చెప్పిన వాటిల్లో 100 కి 99% నిజమయ్యాయి ..”..

“సక్సెస్ రేట్ అలానే ఉంది ..ఒకటో రెండో జరగకపోతే నాదా తప్పు ..? పెద్ద పెద్ద జ్యోతిష్యులు స్వామీజీలు కూడా చెప్పినట్టుగా కొన్నిసార్లు రాంగ్ అవుతాయి .. నా విషయంలో కూడా అలాగే జరిగింది .. సబ్జెక్టు మీద నమ్మకం ఉంది ..దమ్ముంది ..నా ప్రిడక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డికి తప్ప మిగతా అన్ని నిజమయ్యాయి అయినా.. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు కావాలంటే ఎంక్వయిరీ చేసుకోండి .. నాకు ఏపీ ఎన్నికల తర్వాత బిజీ షెడ్యూల్ ఎక్కువ అయిపోయాయి.. ట్రోలింగ్స్ వల్ల పూజలు కూడా నాకు ఎక్కువగా వచ్చేస్తున్నాయి.. ఇంతకుముందు కన్నా ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు”..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news