Moviesచిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ టాప్ స్టార్ లతో అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార.....

చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ టాప్ స్టార్ లతో అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార.. ఆ హీరోతో రొమాన్స్ చేయకపోవడానికి కారణం అదేనా..?

నయనతార ..సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ హీరోయిన్.. అమ్మ బాబోయ్ ..ఒకటా ..? రెండా..? అమ్మడు ఖాతాలో ఎన్ని హిట్లు ఉన్నాయో ..ఎంత చెప్పుకున్నా తక్కువే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు నయనతార . తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో నటించింది . కానీ ఒక్క హీరోతో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది.

దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది . కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది. ఏ హీరోయిన్ కైనా పవన్ కళ్యాణ్ తో నటించడం అనేది ఒక కల .. అలాంటి అవకాశం వస్తే బుద్ధున్న ఏ హీరోయిన్ కూడా వదులుకోదు..

కానీ నయనతార వదులుకునింది . దానికి కారణం రెమ్యూనరేషన్ . వకీల్ సాబ్ సినిమాలో అంజలి క్యారెక్టర్ కోసం ముందుగా నయనతారనే అనుకున్నారట. కానీ నయనతార ఈ ప్రాజెక్టు రిజెక్ట్ చేసిందట. రెమ్యూనరేషన్ తక్కువ ఉన్న కారణంగానే రిజెక్ట్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కూడా అంతకంటే ముందు కూడా పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా నయనతార.. కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసిందట . దీంతో పవన్ – నయన్ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు . ఇకపై వస్తుందన్న నమ్మకాలు లేవు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news