Moviesప‌వ‌న్‌ను మ‌ళ్లీ డ‌బ్బు మాయ‌లో మోసం చేస్తోన్న త్రివిక్ర‌మ్‌...!

ప‌వ‌న్‌ను మ‌ళ్లీ డ‌బ్బు మాయ‌లో మోసం చేస్తోన్న త్రివిక్ర‌మ్‌…!

ఎస్ ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌ళ్లీ ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. త్రివిక్ర‌మ్ తెర‌వెన‌క ఉంటూ ప‌వ‌న్ సినిమాలు సెట్ చేస్తున్నాడు. రీమేక్ క‌థ‌లు పెట్టుకుని.. వాటిలో కొంత మార్పులు, చేర్పులు చేసి ఓ బుడ్డ డైరెక్ట‌ర్‌ను పెట్టి తెర‌వెన‌క త్రివిక్ర‌మ్ అంతా తానై న‌డిపించి సినిమాను చుట్టేస్తున్నాడు. అలా చేసిన‌వే వ‌కీల్‌సాబ్‌, భీయ్లానాయ‌క్‌, బ్రో సినిమాలు. ఈ సినిమాల ఫ‌లితాలు అంత గొప్ప‌గా ఏం లేవు. పైగా ఇవ‌న్నీ రీమేక్‌లే.

ఈ సినిమాలు చేసిన డైరెక్ట‌ర్ల‌కు వ‌చ్చిన రెమ్యున‌రేష‌న్ల కంటే ఈ సినిమాకు తెర‌వెన‌క సాయం చేసిన త్రివిక్ర‌మ్ నాలుగైదు రెట్లు ఎక్కువుగా రెమ్యున‌రేష‌న్లు అందుకున్న మాట వాస్త‌వం. పైగా ఈ సినిమాల‌కు ప‌వ‌న్ కేటాయించిన కాల్షీట్లు కూడా మ‌హా అయితే 25 రోజుల‌కు కాస్త అటూ ఇటూగా ఉంటున్నాయి. ఏ మాత్రం వ‌ర్క‌వుట్ చేయ‌కుండా తీసిన ఈ సినిమాలు ప‌వ‌న్ రేంజ్‌కు త‌గిన‌ట్టుగా స‌క్సెస్ కాలేదు.

క‌ట్ చేస్తే ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్‌ను ఆ డ‌బ్బు మాయ‌లో ముంచేందుకు తాను కూడా తెర‌వెన‌క ప‌ని చ‌క్క పెట్టి కొంత వెన‌కేసుకునేందుకు ఇలాంటి ప్రాజెక్టే ఒక‌టి సెట్ చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా. త్రివిక్ర‌మ్‌ను మ‌ధ్య‌లో పెట్టి ప‌వ‌న్‌తో ఓ చిన్న సినిమా ప్లాన్ చేస్తోంద‌ట జీ గ్రూప్‌. బ్రో సినిమా తెర‌ముందు ఫీఫుల్స్ మీడియా క‌నిపించినా.. తెర‌వెన‌క ఆ సినిమా ఫండింగ్ అంతా జీ గ్రూప్‌దే అన్న ప్ర‌చారం న‌డిచింది.

ఇప్పుడు ప‌వ‌న్ కొత్త సినిమా కూడా 25 రోజుల్లో లాగేయాల‌ని జీ గ్రూప్ ప్లాన్ అట‌. ఇప్పుడు ఈ డీల్ సెట్ చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ట త్రివిక్ర‌మ్‌. ప‌వ‌న్ నాలుగు నెల‌ల త‌ర్వాత సెట్స్ మీద‌కు వ‌చ్చినా ఓజీ, ఆ త‌ర్వాత ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఉన్నాయి. వాట‌న్నింటిని ప‌క్క‌న పెట్టి ఇప్పుడు ఈ కొత్త సినిమాకు ప‌వ‌న్ ఓకే చెప్పినా ఆశ్చ‌ర్యం లేదు. అంతా త్రివిక్ర‌మ్ మాయ‌.. ఏదేమైనా ప‌వ‌న్ ఇలా త్రివిక్ర‌మ్ మాయ‌లో ప‌డితే అత‌డి నుంచి గుర్తుంచుకునే సినిమాలు ఇక చూడ‌లేం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news