Moviesఎప్పుడు లేని విధంగా.. ఫస్ట్ టైం స్టేజీ పై మహేశ్ బాబు...

ఎప్పుడు లేని విధంగా.. ఫస్ట్ టైం స్టేజీ పై మహేశ్ బాబు ఎమోషనల్ అవ్వడానికి కారణం ఇదే.. పాపం..!!

గుంటూరు కారం ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారు మ్రోగిపోతుంది . సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది . జనవరి 12వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతుంది . ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం . చిత్ర బృందానికి సంబంధించిన ప్రతి ఒక్కరు హాజరై సినిమా ఈవెంట్ ని ఫుల్ సక్సెస్ చేశారు.

ఈ ఈవెంట్ లో స్టేజీ పై కి వచ్చిన మహేష్ బాబు మాట్లాడుతూ ..గతంలో ఎప్పుడూ లేనివిధంగా అగ్రేసివ్ గా ఎమోషనల్ గా కనిపించారు . ఈ సినిమా షూటింగ్ ఉన్న సమయంలోనే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. తల్లి – తండ్రి మరణంతో మహేష్ బాబు చాలా డీలాపడిపోయారు . మహేష్ కు తల్లితండ్రులు లేని బాధ ఎవరు తీర్చలేనిది .

కాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ..” ప్రతి సంక్రాంతికి నా సినిమా రిలీజ్ అయినప్పుడు మా నాన్నగారు ఫోన్ చేసి సినిమా బాగుంది.. బ్లాక్ బస్టర్ అని నాకు చెప్తాడు.. ఈసారి నాకు అలా చెప్పడానికి మా నాన్న లేరు ..మీరే చెప్పాలి.. ఈసారి కూడా బాగా గట్టిగానే కొడతాం “అంటూ కూసింత ఎమోషనల్ అయ్యారు . అయితే గతంలో మహేష్ బాబు ఎప్పుడు ఇంత ఎమోషనల్ గా స్టేజిపై మాట్లాడింది లేదు. మరి ఫస్ట్ టైం ఎందుకు ఇలా ఎమోషనల్ గా మాట్లాడారు అంటే మాత్రం తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమానే గుంటూరు కావడంతోనే ఆయన ఈ ఈవెంట్లో అలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news