Moviesఆహ్వానం అందినా కూడా.. ఉపాసన అయోధ్యలో అడుగు పెట్టకపోవడానికి కారణం అదేనా..?

ఆహ్వానం అందినా కూడా.. ఉపాసన అయోధ్యలో అడుగు పెట్టకపోవడానికి కారణం అదేనా..?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రామ నామాలతో మారుమ్రోగిపోతున్నాయి . దేశ ప్రజలు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు . నిన్న దేశవ్యాప్తంగా 500 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో దేశమంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది . చాలామంది స్టార్ ప్రముఖులు రాజకీయ నేతలు అయోధ్యలో సందడి చేశారు .

ఘనంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దేశ ప్రజలు చాలామందికి అయోధ్యకు వెళ్లడానికి ఆహ్వానం అందింది . వాళ్ళల్లో మన రామ్ చరణ్ – ఉపాసన కూడా ఉన్నారు. అయితే రామ్ చరణ్ అయోధ్యకు వెళ్లారు కానీ ఉపాసన వెళ్లలేదు. దీంతో ఎందుకు ఉపాసన అయోధ్యకు వెళ్లలేదు ..?? రామ్ చరణ్ సింగిల్గానే అటెండ్ అయ్యాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

అయితే ఉపాసన క్లింకారాని తీసుకొని అంత దూరం జర్నీ చేయడం ఒక రిస్క్ అయితే ..అంత మంది జనాల మధ్య క్లింకార ఇన్ఫెక్షన్ కి గురవుతుందని డాక్టర్స్ హెచ్చరించడంతోనే ఆమె అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లలేదట . నిజానికి ముందు నుంచి ఈ కార్యక్రమానికి వెళ్లాలని చాలా ఆశగా ఉండిందట ఉపాసన . కానీ క్లింకారాను చూసుకోవడానికి ఆగిపోయిందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news