Moviesఎన్టీఆర్ ' దేవ‌ర‌ ' కు కొత్త క‌ష్టం... త‌ప్పు ఎవ‌రిది.....

ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ కు కొత్త క‌ష్టం… త‌ప్పు ఎవ‌రిది.. ఎక్క‌డ జ‌రిగింది…?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్నా ప్రస్టేజ్ సినిమా దేవర. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత కొరటాల శివ సవాల్‌గా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొరటాల కసితో దేవరను రెండు భాగాలుగా తీస్తున్నారు. ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా జనవరి ఫస్ట్ వీక్ లో ఒక గ్లింప్స్‌ వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లోగా సినిమా మీద మరో ప్రచారం కూడా నడుస్తోంది.

కొరటాల ఇప్పటికే చాలా రోజులు షూట్ చేస్తూ వస్తున్నారు. కోట్ల కొద్ది ఖర్చు చేసినా ఫుటేజ్ తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇన‌ర్‌ సర్కిల్స్ లో బాగా చర్చ‌కు వ‌స్తుంది. పెట్టిన కోట్ల కొద్ది పెట్టుబడి త‌క్కువ ఫుటేజ్‌కే ఖర్చయిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బడ్జెట్ ఎక్కువ కావటం.. ఫుటేజ్ తక్కువగా ఉండడంతో దేవర సినిమాను రెండు భాగాలుగా మార్చారని తెలుస్తోంది. ఈ సినిమాను ఒకే పార్టుగా రిలీజ్ చేస్తే వర్కౌట్ కాదని కొరటాల రెండు పార్ట్‌లుగా డివైడ్ చేసినట్టు తెలుస్తోంది.

తొలిభాగంలో విశ్రాంతి దగ్గర ఆపే కథను.. రెండు భాగాలుగా చేయడం వల్ల తొలిభాగం చివరలో ఆపుతారని తెలుస్తోంది.అయితే ప్రస్తుతానికి దేవర సినిమాకు కాస్త ఫండింగ్ అవసరమని తెలుస్తోంది. సినిమాకు ముందు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టేశారు. పైగా జాన్వీ కపూర్, సైఫ్ఆలీ ఖాన్ లాంటి బాలీవుడ్ బడాస్టార్‌లు ఉన్నారు. అలాగే మరో బాలీవుడ్ హీరోని కూడా తీసుకోబోతున్నారు. గోవా సముద్రంలో వేసిన స్పెషల్ సెట్స్ కోసం కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేశారు.

ఈ సినిమాను కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బడ్జెట్ అవడంతో ఆ మేరకు బయట నుంచి ఫండింగ్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఫండింగ్‌ అంటే అస్సలు కొరత ఉండదు. అయితే సినిమాపై అంచనాలు మరింత పెంచేలా సంక్రాంతి వస్తున్న గ్లింప్స్‌ ఉండబోతుందని తెలుస్తోంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news