Newsబాల‌య్య - మ‌హేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌... మ‌ధ్య‌లో త్రివిక్ర‌మ్‌..!

బాల‌య్య – మ‌హేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌… మ‌ధ్య‌లో త్రివిక్ర‌మ్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత వ‌స్తోన్న సినిమా ఇది. 13 ఏళ్ల త‌ర్వాత మ‌హేష్ – త్రివిక్ర‌మ్ ఈ సినిమా కోసం జోడీక‌ట్టారు.

ఇక గుంటూరు కారం సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి రేపు సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం త్రివిక్ర‌మ్ చాలా తెలివిగా బాల‌య్య‌ను వాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య హోస్ట్ చేస్తోన్న టాక్ షో సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ఎంత‌లా ఉప‌యోగ‌ప‌డుతుందో చూస్తూనే ఉన్నాం.

దేశ‌వ్యాప్తంగా భారీ బ‌జ్‌తో రిలీజ్ అయిన యానిమ‌ల్ సినిమా ప్ర‌మోష‌న్ల కోస‌మే బాల‌య్య‌ను వాడేశారు. ఈ ఎపిసోడ్ కోసం ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగాతో పాటు హీరోయిన్ ర‌ష్మిక‌, బాలీవుడ్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా స్వ‌యంగా బాల‌య్య షోకు వ‌చ్చారు. ఇక ఇప్పుడు గుంటూరు కారం కోసం హీరో మ‌హేష్‌బాబు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా ఆహాలో అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్‌కు వ‌స్తున్నార‌ట‌.

ఈ ఎపిసోడ్ ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోస‌మే స్పెష‌ల్‌గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇదే ఎపిసోడ్‌లో హీరోయిన్లు శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి కూడా పాల్గొంటారా లేదా ? అన్న‌ది చూడాలి. ఏదేమైనా ఈ ఎపిసోడ్ గుంటూరు కారం సినిమా హైప్‌కు ఎంతైనా హెల్ఫ్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక గ‌తంలో ఇదే ఆహాలో స్ట్రీమ్ అయిన బాల‌య్య – మ‌హేష్ ఎపిసోడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news