Newsశ్రీదేవి మృతిపై ముందుగానే నాగార్జున‌కు తెలిసిన సీక్రెట్ ఇదే...!

శ్రీదేవి మృతిపై ముందుగానే నాగార్జున‌కు తెలిసిన సీక్రెట్ ఇదే…!

దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి దుబాయిలో అనుమానాస్పద స్థితిలో కొన్నేళ్ల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి ఏ రోజు వరకు తన భార్య మరణంపై నోరు విప్పని బోనీకపూర్ తాజాగా ఆమె మృతిపై తన సందేహాలు బయటపెట్టారు. శ్రీదేవి కఠినమైన ఆహార నియమాలు పాటించడంతో పాటు.. ఉప్పు కారం లేని ఆహారం తీసుకునేదని.. అందుకే కొన్నిసార్లు లో బీపీతో ఆమె కళ్ళు తిరుగు పడిపోతూ ఉండేదని బోనికపూర్ చెప్పారు.

అందంగా కనిపించడం కోసం మంచి శరీర ఆకృతి మైంటైన్ చేయడం కోసం శ్రీదేవి తన శరీరాన్ని బాగా కష్టపెట్టేది.. ఇంత కఠినమైన ఆహార నియమాలు పాటించవద్దని వైద్యులు ఎన్నోసార్లు చెప్పినా.. ఆమె వినలేదు అని.. ఆమె మృతి చెందిన రోజు కూడా చాలా కఠినంగా డైట్ ఫాలో కావడం.. ఆ కారణంతోనే పడిపోయి ఉంటుందని బోనీ అనుమానం వ్యక్తం చేశారు. అయితే శ్రీదేవి మరణం తర్వాత బోనికపూర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన టాలీవుడ్ హీరో నాగార్జున కూడా ఇదే విషయాన్ని బోనీతో వెల్లడించాడట.

నాగార్జున – శ్రీదేవి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. ఆఖరిపోరాటం సినిమాతో పాటు గోవిందా గోవిందా సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ టైంలో కూడా శ్రీదేవి చాలా కఠినంగా డైట్ ఫాలో అయ్యేదట .షూటింగ్ టైంలో శ్రీదేవి కళ్ళు తిరిగి పడిపోవ‌డం రెండుసార్లు తాను కళ్ళారా చూశానని నాగార్జున బోనీకి చెప్పారట.

ఓసారి సినిమా షూటింగ్లో ఆమె బాత్రూంలో కళ్ళు తిరిగి పడిపోయిందని.. అప్పుడు ఆమె పన్ను కూడా విరిగిపోయిందని నాగార్జున బోనికి చెప్పారట. అంటే శ్రీదేవి బోనికపూర్ చెప్పినట్టు నిజంగా కఠినమైన ఆహార నియమాలు పాఠించి చనిపోయి ఉంటే ఇదంతా ఎప్పటినుంచో జరుగుతూ వస్తుందని.. గతంలో నాగర్జున షూటింగ్ టైంలో కూడా ఇలాగే జరిగిందని క్లియర్ గా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news