Moviesవేశ్యని హీరోయిన్ గా మార్చిన ఎన్టీఆర్.. ఎవ్వరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ...

వేశ్యని హీరోయిన్ గా మార్చిన ఎన్టీఆర్.. ఎవ్వరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ పై వేశ్య అని ముద్ర పడిన తర్వాత ఏ డైరెక్టర్స్ కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా అలాంటి పాత్రలనే ఇస్తూ ఉంటారు . అలాంటి పేరుని దక్కించుకునింది నటి రాజసులోచన . అప్పట్లో ఈమె పాపులర్టి ఓ హీరోయిన్ కి కూడా ఉండేది కాదు. నటిగా , డాన్సర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది . అయితే సినిమాలో నర్తకి గా కనిపించాలని ఆశపడింది రాజ సులోచన . ఆమె కలలను కాదనలేక తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు .

అయితే మొదట్లో తండ్రికి ఇష్టం లేని వేశ్య పాత్రలో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది . తల్లి ప్రోత్సాహంతోనే వేశ్య వేసే పాత్రలను భయపడకుండా నటించింది. అలా అలా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వేశ్య పాత్రలకు బాగా పాపులారిటీ దక్కించుకుంది . అయితే ఆమె చాలా సందర్భాలలో బాధపడింది . నాకు నటనకు తగ్గ పాత్రలు ఎవరైనా ఇవ్వకపోతారా..? అంటూ వెయిట్ చేసింది.

ఆ టైంలో నే నందమూరి తారక రామారావు గారు ఆమెలోని టాలెంట్ ని గుర్తించి టైగర్ రాముడు సినిమాలో ఆఫర్ ఇచ్చాడు . దాంతో ఆమె సినిమా కెరియర్ మొత్తం తిరిగిపోయింది . అప్పటివరకు వేశ్య పాత్రలకే పరిమితమైన ఆమె ఆ తర్వాత మంచి మంచి సినిమాలలో కథానాయకగా నటించింది. అలా ఎన్టీఆర్ తో మరో నాలుగైదు సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది . కెరియర్ మొత్తంలో వివిధ రకాల పాత్రను పోషించిన రాజ సులోచన.. ఎలాంటి పాత్రలు అయినా అవలీలగా పోషించేది . ఇలా ఎన్టీఆర్ ఆమె కెరియర్ నే మార్చేశాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news