Newsఆ కార‌ణంతోనే గుంటూరు కారం నుంచి పూజాను పీకేశాం.. నిర్మాత సంచ‌ల‌న...

ఆ కార‌ణంతోనే గుంటూరు కారం నుంచి పూజాను పీకేశాం.. నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ సినిమా గుంటూరు కారం. మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెర‌కెతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ?ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు అయితే మోత మోగించేస్తున్నారు. మహేష్ కి జోడిగా శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లోకి ఈ సినిమా దిగనుంది. సినిమా రిలీజ్ కు మరో మూడు నెలల టైం మాత్రమే ఉండడంతో త్రివిక్రమ్ చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టోటల్ కాస్టింగ్ రు. 200 కోట్లకు పైగా కానుంది. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా ముందుగా పూజ హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నారు.

గతంలో మహేష్ – పూజ హెగ్డే కాంబినేషన్లో వచ్చిన మహర్షి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడంతో సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను ఫస్ట్ హీరోయిన్ చేశారు. సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి వచ్చింది. దీనిపై చాలా రూమర్లు వచ్చాయి. అయితే గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే ఎందుకు ? తప్పుకోకుండా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.

గుంటూరు కారం సినిమా రిలీజ్‌ను ఆగస్టులో అనుకున్నాం.. ఇప్పుడు సంక్రాంతికి పోస్ట్‌పోన్ కావడంతో చాలా స్లోగా షూటింగ్ చేస్తున్నాం. ఇదే టైంలో పూజ బాలీవుడ్ లో ఒక సినిమా చేయాల్సి ఉండడంతో డేట్లు సర్దుబాటు కాలేదు.. దీంతో ఆమె గుంటూరు కారం నుంచి తప్పించి సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా చేసి.. మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news