Newsబాలకృష్ణ - వెంక‌టేష్ ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు ఇలా మోస‌పోయారా...ఆ రెండు...

బాలకృష్ణ – వెంక‌టేష్ ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు ఇలా మోస‌పోయారా…ఆ రెండు సినిమాలు ఇవే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ- వెంకటేష్ స్టార్ హీరోలగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటిస్తూ నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఓకే జనరేషన్ కి చెందిన ఇద్ద‌రు హీరోలు ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. ఓ సినిమా విషయంలో మాత్రం వెంకటేష్, బాల‌య్య ఒక‌రికి తెలియ‌కుండానే మ‌రొక‌రు ఇద్ద‌రిని మోసం చేసుకున్నారు. బాల‌కృష్ణ‌. చిత్ర‌ పరిశ్రమలో స్టార్ హీరోల‌ మధ్య పోటీ అనేది ఎంతో కామన్.

అయితే మరీ ముఖ్యంగా సంక్రాంతి- దసరా వంటి పండగల టైంలో హీరోల మధ్య ఎంతో గట్టి పోటీ నడుస్తుంది. ఇదే తరహాలో గతంలో ఒకే కథతో ఒకేరోజు బాలయ్య- వెంకటేష్ ఇద్దరు బాక్సాఫీస్ వద్దద పోటీపడ్డారు. ఈ సినిమాలు విడుదలై ఇప్పటికే 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. అయితే వీరిద్దరు చేసిన సినిమాలు ఒకే ఒకే కథతో వచ్చాయి. అలా వచ్చిన సినిమాల్లో ముందుగా బాలకృష్ణ నటించిన అశోక్ చక్రవర్తి, వెంకటేష్ నటించిన ధృవ నక్షత్రం సినిమాలో ఒకే కథతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.

ముందుగా బాలకృష్ణ నటించిన అశోక్ చక్రవర్తి సినిమాను మలయాళం లో మోహన్ లాల్ నటించిన ఆర్యన్ సినిమాకి రీమేక్‌గా తెర‌క్కెకించారు. ఈ సినిమాకు ఎస్‌ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించారు. వెంకటేష్ నటించిన ధృవ నక్షత్రం సినిమాను కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాను కూడా మలయాళం లో వచ్చిన మోహన్‌లాల్ సినిమా ఆర్యన్ సినిమాని ప్రేరణగా తీసుకొని తెర‌క్కెకించారు.

అయితే బాక్స్ ఆఫీస్ బరిలో వెంకటేష్ ధృవ నక్షత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అయితే బాలకృష్ణ అశోక చక్రవర్తి సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు. ఒకరకంగా బాలయ్య, వెంకటేష్ ను మోసం చేసింది పరుచూరి బ్రదర్స్ అనే చెప్పాలి. ఏది ఏమైనా ఒకే కథతో వెంకటేష్ హిట్ అందుకుంటే… బాలకృష్ణ హిట్ అందుకోలేక పోయారు. ఇలా బాలయ్య, వెంకటేశ్ ఒకే కథతో బాక్సాఫీస్ బరిలోకి దిగగా వెంకీ హిట్ కొడితే… బాల‌య్య సినిమా ప్లాప్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news