Newsదివంగ‌త స్టార్ హీరోయిన్ సౌంద‌ర్య మ‌ళ్లీ పుట్టింది... ఎవ‌రి క‌డుపునో తెలుసా..!

దివంగ‌త స్టార్ హీరోయిన్ సౌంద‌ర్య మ‌ళ్లీ పుట్టింది… ఎవ‌రి క‌డుపునో తెలుసా..!

దివంగత కన్నడ కస్తూరి సౌందర్యకు తెలుగు నాట ఎంతో క్రేజీ ఉంది. సౌందర్య తెలుగు అమ్మాయి అయినా కూడా తెలుగు ప్రేక్షకులు తమ ఇంటి ఆడపడుచుగా.. తమ ఇంటి అమ్మాయిగా సౌందర్యను ప్రేమించారు. సౌందర్య ఎందరో స్టార్ హీరోలతో ఎన్నో సంవత్సరాలపాటు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించినా సాంప్రదాయం విషయంలో ఆమె ఏనాడు లైన్ దాటలేదు. ఎక్స్పోజింగ్ చేయకుండా చాలా ట్రెడిషనల్ గా నటిస్తూ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో దశాబ్దంన్నర పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్గా కొనసాగిన సౌందర్య సినిమాలకు గుడ్ బై చెప్పాక తన సొంత మేనబావ‌ అయిన రఘును పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి అయిన ఏడాదికే 2004లో కరీంనగర్ నుంచి బిజెపి తరఫున పోటీ చేస్తున్న కేంద్రం మాజీమంత్రి విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లో వస్తూ హెలికాప్టర్ కూలి తన సోదరుడితో పాటు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతి చెందే నాటికి గర్భవతిగా ఉన్నారు. ఇదిలా ఉంటే సౌందర్య మరణం తర్వాత ఆమె భర్త రఘు మరో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రఘు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నారు.

రఘుకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని సౌందర్యకు సమకాలీనురాలు అయిన మరో సీనియర్ హీరోయిన్ ప్రేమ చెప్పారు. సౌందర్య భర్త రఘు తనతో ఇప్పటికీ ఫోన్ టచ్ లో ఉంటారని.. రఘుకు ఇద్దరు కుమార్తెలు పుట్టారని.. సౌందర్య మళ్ళీ పుట్టినట్టు అనుకోవచ్చని ప్రేమ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక సౌందర్య సినిమాల్లోకి రావడం వెనక తండ్రి సహకారం ఎంతో ఉంది.

సౌందర్య హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే 1996లో తండ్రి మృతిచెందగా.. సౌందర్య తల్లి మూడు సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇక సౌందర్య సంపాదించిన కోట్లాది ఆస్తులు ఇప్పుడు ఆమె భర్త కంట్రోల్లో ఉన్నాయి. ఏది ఏమైనా సౌందర్య పేరు గుర్తుకు వస్తే తెలుగు ప్రేక్షకులు మదిలో ఆమె రూపం ఎప్పుడు అలా నిలిచిపోయి ఉంటుందన‌టంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news