News' గుంటూరు కారం ' ఎఫెక్ట్‌.... రాజ‌మౌళి కోపం ఎవ‌రిపైన‌...!

‘ గుంటూరు కారం ‘ ఎఫెక్ట్‌…. రాజ‌మౌళి కోపం ఎవ‌రిపైన‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతోంది. శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ ( చినబాబు) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు టాలీవుడ్ దగ్గర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో తన 28వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నట్టు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఇందుకోసం మహేష్ బాబుకు నాలుగైదు నెలల ముందు నుంచే శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా జిమ్ కూడా ఏర్పాటు చేశారు.

ఇదంతా జరుగుతుండగానే మహేష్ 29వ సినిమా రాజమౌళితో కాకుండా అనిల్ రావిపూడితో ఉంటుందని నాలుగైదు రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో రాజమౌళి సినిమాపై మహేష్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల అటెన్షన్ ఒక్కసారిగా మారింది. అయితే ఈ వార్తలపై రాజమౌళి కాస్త అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వార్తలకు చెక్‌ పెట్టేందుకు రాజమౌళి నిర్ణయించుకున్నారట‌. మహేష్ బాబుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి గుంటూరు కారం తర్వాత సినిమా తన దర్శకత్వంలో ఉంటుందని పూర్తిగా క్లారిటీ ఇచ్చిన అనంతరం సెట్స్ మీదకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అస‌లే గుంటూరు కారం బాగా ఆల‌స్య‌మ‌వుతుంద‌న్న కోపంతో ఉన్న రాజ‌మౌళికి ఈ వార్త‌లు మ‌రింత కోపంగా మారాయి. ఇటు మహేష్ బాబు కూడా త‌న‌ 29 మూవీని పక్కాగా రాజమౌళితోనే చేయాలని బలంగా డిసైడ్ అయిపోయాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు ఏడాదిన్నర పాటు ఫుల్ కాల్ సీట్లు రాజమౌళికి ఇచ్చినట్టు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు లోకి ఇంకా ఎవరెవరు జాయిన్ అవుతారు అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news